వాళ్ళు రాకపోవడమే మంచిదైంది

ఈ మద్య తెలంగాణ ఎలక్షన్స్ నేపద్యంలో కుకట్ పల్లి నియోజక వర్గానికి తెలుగు దేశం తరుపున నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని పోటి చేసిన సంగతి తెలిసిందే. కుకట్ పల్లి నుండి చాలా సింపుల్ గా విజయం దక్కుతుందని భావించిన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబుకు అక్కడ సుహాసిని ఓటమితో ఒక్కసారి గా షాక్ తిన్నాడు. ఎందుకు అంటే అక్కడ అంత ఆంధ్ర నుండి వచ్చిన వారు ఉన్నారు కావున చాలా సింపుల్ గా పనవుతుందని చంద్రబాబు అనుకున్నాడు. దీనికి తోడు స్టార్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణ ప్రచారం చెయ్యడం. బాలకృష్ణ వెంట తారకరత్న కూడా కలిసి ఎలక్షన్స్ కాంపెయిన్ చెయ్యడంతో అందరు విజయం తద్యం అనుకున్నారు. కానీ తెరాస కారు స్పీడ్ కి సైకిల్ చక్రాలు విరిగిపోయాయి.

వాళ్ళు రాకపోవడమే మంచిదైంది - Telugu Bullet

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా తమ అక్క నందమూరి సుహాసినికి ఎక్కడ కాంపెయిన్ చెయ్యలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా తమ అక్కకు ఓటు వెయ్యమని అభ్యర్ధించలేదు. వాళ్ళు ప్రచారం చెయ్యకపోవడమే మంచిదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతె నందమూరి ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చిన నందమూరి సుహాసిని ని గెలిపించుకోలేక పోయాం అనే మాట నేడు వచ్చేది. వాళ్ళు ప్రచారం చెయ్యకపోవడమే మంచిది అంటున్నారు ఇప్పుడు అక్కడి జనాలు. మరో నిందగా తెరాస కు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు వ్యతిరేకులం అనే నింద పడేది చాలా తెలివిగా నందమూరి బ్రదర్స్ తప్పించుకున్నారు.