మహేష్‌ వల్ల పోగొట్టుకున్నది చరణ్‌తో రాబట్టుకునేందుకు..!

NV Prasad to Produce new movie with Ram Charan Tej

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మరియు సూపర్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ల కాంబో మూవీ అంటే ఎంత బడ్జెట్‌ పెట్టినా తిరిగి రావడం ఖాయం అని నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ భావించాడు. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో ‘స్పైడర్‌’ చిత్రాన్ని నిర్మించాడు. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా బాగానే అయ్యింది. సినిమా నిర్మాతకు భారీగా లాభాలను తెచ్చి పెట్టడం ఖాయం అని అంతా అనుకున్నారు. కాని షాకింగ్‌గా సినిమా నిర్మాతకు దాదాపు 20 కోట్ల మేరకు నష్టాలను మిగిల్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సినిమాలు అన్నప్పుడు నష్టాలు రావడం, లాభాలు రావడం చాలా కామన్‌. ఒక్క సినిమా ఫ్లాప్‌ అవ్వగానే సినిమాల నుండి తప్పుకుంటామా అంటూ ఎన్వీ ప్రసాద్‌ తన తర్వాత సినిమాను చరణ్‌తో నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

ram charan teja rangasthalam

ప్రస్తుతం మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో ‘రంగస్థలం’ చిత్రాన్ని రామ్‌చరణ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. తర్వాత చరణ్‌ చేయబోతున్న సినిమా ఏంటీ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఎన్వీ ప్రసాద్‌కు మాత్రం చరణ్‌ డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చరణ్‌తో వచ్చే సంవత్సరంలో అల్లు అరవింద్‌తో కలిసి ఒక సినిమాను ఎన్వీ ప్రసాద్‌ నిర్మించబోతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు, సంప్రదింపులు పూర్తి అయ్యాయి. దర్శకుడు ఎవరు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రం వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే చరణ్‌ కొరటాల శివ, బోయపాటిలలో ఒక దర్శకుడితో సినిమాను చేసే అవకాశం ఉంది. మరి ఆ సినిమాకు నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ అయ్యి ఉంటాడా లేదా మరో సినిమాను చరణ్‌తో ఎన్వీ ప్రసాద్‌ చేస్తాడా అనేది చూడాలి.