సైరా సెకండ్‌ షెడ్యూల్‌ అధికారిక ప్రకటన

official-announcement-of-sy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవలే పూర్తి అయిన విషయం తెల్సిందే. రెండవ షెడ్యూల్‌ గురించి గత కొన్ని రోజులుగా పలు పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ అనుకున్న స్థాయిలో జరగలేదని, దర్శకుడు సురేందర్‌ రెడ్డి వర్కింగ్‌ స్టైల్‌, సినిమాకు సెట్‌ అవ్వడం లేదు, ఆ కారణంగా దర్శకుడిని మార్చే యోచనలో ఉన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును ఈ సినిమా కోసం పిలిచారని, ఆయన నో చెప్పాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అసలు సైరా ప్రాజెక్ట్‌ను నిలిపేశారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. కాని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు సెకండ్‌ షెడ్యూల్‌ ఏర్పాట్లలో మునిగి పోయారు. 

దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఒక ఫిల్మ్‌ స్టూడియోలో సినిమా కోసం భారీ సెట్టింగ్‌ల నిర్మాణం జరుగుతుంది. అలాగే తమిళనాడులోని పొల్లాచ్చిలో కూడా సైరా కోసం ఒక ఫారెస్ట్‌ సెట్టింగ్‌ను సిద్దం చేస్తున్నారు. ఇలా చకచక సైరా చిత్రం కోసం అండర్‌ గ్రౌండ్‌ వర్క్‌ జరిగి పోతుంది. సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణను వచ్చే నెల 20 నుండి మొదలు పెట్టబోతున్నారు. రెండవ షెడ్యూల్‌లో హీరోయిన్‌ నయనతారతో పాటు ముఖ్య తారాగణం పాల్గొనబోతున్నారు. దాదాపు 25 రోజుల నుండి 30 రోజుల వరకు అవసరానుగుణంగా చిత్రీకరణ జరుపనున్నారు. ఆ తర్వాత మరో నెల రోజుల గ్యాప్‌ తీసుకుంటారు అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి సైరా చిత్రీకరణ మెల్లగా అనుకున్న రీతిలో సాగిపోతుందని, అందరి అంచనాలను అందుకునే ఔట్‌ పుట్‌ వస్తుందనే నమ్మకంతో తాము ఉన్నాము అంటూ మెగా అండ్‌ టీం ధీమాగా ఉన్నారు.