కులాలు వేరు కాబట్టే హత్యాయత్నం…!

One More Honour Killing In Hyderabad

కులాంతర వివాహం చేసుకున్నారని నవదంపతులపై నగరం నడిబొడ్డున హత్యాయత్నం చేయడం నగరంలో కలకలం సృష్టించింది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్‌ ఈ నెల 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లిని జీర్ణించుకొని మాధవి తండ్రి మనోహర చారి కక్షతో వారిపై పట్టపగలే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై సందీప్‌ సోదరుడు సతీష్‌ సాక్షితో మాట్లాడుతూ.. ‘అమ్మాయి తండ్రి ఫోన్‌ చేసి హోండా షో రూం దగ్గరకు రమ్మన్నాడు. ఆ తర్వాత ప్లాన్‌ ప్రకారం వెంట తెచ్చుకున్నకత్తితో ఇద్దరిపై దాడిచేశాడు. కులాంతర వివాహం చేసుకున్నారని పగతోనే ఈ దాడి చేశాడు. మా అన్న పెళ్లి చేసుకొని ఐదు రోజులే అవుతోంది.

intercast-marriage
పెళ్లి అయిన తరువాత వాళ్ల కుటుంబం వచ్చి మా పాపను మంచిగా చూసుకోండి అని చెప్పారు. మళ్లీ ఈరోజు అతను బాగా తాగి వచ్చి దాడి చేశాడు. రిసెఫ్షన్‌ చేస్తామని నమ్మించాడు. సందీప్‌ పరిస్థితి పరవాలేదు కానీ అమ్మాయి పరిస్థితి సీరియస్ గా ఉందని ఐదేళ్ల నుంచి వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు.

hyd-intercast-marriage

10వ తరగతి నుంచే లవ్‌ చేసుకుంటున్నారు. మాది మాల కుటుంబం. అమ్మాయిది విశ్వబ్రాహ్మణ కులం. ఇద్దరు మేజర్లేనని డ్రిగ్రీ కూడా పూర్తి చేశారని తెలిపాడు.