‘పందెం కోడి 2’ టీజర్ : దుమ్ము రేపుతోంది

Pandem-Kodi-2-Official-Teas

 

అప్పుడెప్పుడో విశాల్, మీరా జాస్మిన్ కాంబినేషన్‌లో వచ్చిన పందెం కోడి బాక్సాపీస్ వద్ద ఎంత పెద్ద వ్యాజ్యం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదమూడేళ్ళ తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు పందెం కోడి 2 తెర‌కెక్కుతుంది. త‌మిళంలో ఈ చిత్రం సంద‌కోళి 2 పేరుతో విడుద‌ల కానుంది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. విశాల్ గర్ల్ ఫ్రెండ్ అంటూ అప్పట్లో వార్తలు వచ్చిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ లేడి విల‌న్‌ గా ఈ సినిమాలో క‌నిపించ‌నుంది. విశాల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని భావించ‌గా, హ‌రికృష్ణ మృతితో ఆ రోజు టీజర్ విడుదల వాయిదా వేశారు. అలా వాయిదా వేసిన టీజర్ కొద్ది సేప‌టి క్రితమే విడుద‌లైంది.

VISHAL

పందెం కోడి చిత్రంలో విశాల్ చెప్పే డైలాగ్‌తో టీజ‌ర్ మొద‌లు కాగా, త‌ర్వాత సీక్వెల్‌కి సంబంధించి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చూపించారు.‘నేనింకా ఆడుకోవడం మొదలుపెట్టలేదు. అడ్డుకోవడమే మొదలుపెట్టాను’ అని విశాల్‌ చెప్తున్న డైలాగ్‌కు..పక్కనే ఉన్న కీర్తిసురేశ్‌ ఈల వేయడంతో ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే కథ అనే విషయం అర్థమవుతోంది. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ టీజర్ కట్ చేశారు. దేవాలయం .. జాతర నేపథ్యంలోని సన్నివేశాలతో ఈ టీజర్ ను కట్ చేసి వదిలారు. మాస్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాను, తమిళ .. తెలుగు భాషల్లో అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.