Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. పవన్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుద కాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వడం లేదు. అక్టోబర్లోనే షూటింగ్ పూర్తి కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నవంబర్ చివర్లో షూటింగ్కు ఫుల్స్టాప్ పెట్టబోతున్నట్లుగా త్రివిక్రమ్ టీం ప్రకటించింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో చిత్రీకరణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు ఇంకా వారం నుండి పది రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇటీవల జరిగిన వారణాసి షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తి అయినట్లే అని అంతా భావించినా కూడా కొన్ని సీన్స్ను రీషూట్ చేస్తున్నారు అనే టాక్ వినిపస్తుంది.
సాఫ్ట్వేర్ కంపెనీలో పవన్ కళ్యాణ్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం పవన్తో పాటు కొందరు ముఖ్య నటీనటులతో షూటింగ్ చేస్తున్నారు. ఈ వారంలో చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. షూటింగ్ పూర్తి అయ్యిందని ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో చిత్ర యూనిట్ ఇంకా చిత్రీకరణలోనే ఉందనే వార్తలు షాకింగ్గా ఉన్నాయి. ఇంకా షూటింగ్లో ఉన్నా కూడా అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేసి తీరుతాం అని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.