పవన్‌, మహేష్‌ ఫ్యాన్స్‌ బాహాబాహీ

Pawan Kalyan And Mahesh Babu Fans Flexy War in East Godavari District,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Pawan Kalyan And Mahesh Babu Fans Flexy War in East Godavari District

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఇటీవల ఎక్కువగా మీడియాలో వినిపిస్తూ, కనిపిస్తున్నారు. తాజాగా కత్తి మహేష్‌పై వారు చేసిన యుద్దం ఏ రేంజ్‌లో మీడియాలో ప్రచారం జరిగిందో తెలిసిందే. పవన్‌ను విమర్శించినందుకు కత్తి మహేష్‌కు జీవితంపై విరక్తి వచ్చేలా కుమ్మేశారు.

సోషల్‌ మీడియాలో పవన్‌ ఫ్యాన్స్‌ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక తాజాగా గోదావరి జిల్లాలో పవన్‌ ఫ్యాన్స్‌ మరోసారి రెచ్చి పోయారు. ఈసారి మహేష్‌బాబు ఫ్యాన్స్‌పై దాడికి దిగారు. పలువురికి  గాయాలు కూడా అయ్యాయి.వివరాల్లోకి వెళ్తే… తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండంలోని అనాతవరం అనే గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది.

ఆ సందర్బంగా టపాసులు కాల్చడం జరిగింది. ఆసమయంలో టపాసుల మంటలు పవన్‌ అభిమానులు కట్టిన ఒక ప్లెక్సీని కాల్చేశాయి. దాంతో పవన్‌ అభిమానులు రెచ్చి పోయి మహేష్‌బాబు అభిమానులు కావాలని తమ ప్లెక్సీని కాల్చేశారు అంటూ పక్కనే ఉన్న మహేష్‌ అభిమానుల ప్లెక్సీని చించేశారు. దాంతో ఇరు వర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపైకి ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు, ముష్టి యుద్దాలకు దిగారు. దాంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున దిగారు. దాదాపు 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

కుశ టీజర్‌ వచ్చేసింది …ఎన్టీఆర్ అదుర్స్

బాలయ్య న్యూస్ మెటీరియల్