Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Pawan Klayna Keerthi Suresh Latest Movie
టాలీవుడ్ లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ..త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమానే. షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే గడుస్తున్నా సినిమాకు సంబంధించిన విశేషాలేమీ బయటకు రావటం లేదు. ఇంతవరకూ టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. ఇది పవన్ కళ్యాణ్ 25వ చిత్రం కావటం, అత్తారింటికి దారేది లాంటి భారీ విజయం తరువాత త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో అటు సినీ వర్గాల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. వాటికి తగ్గట్టుగానే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. దాదాపు 150 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. కాగా అభిమానులను మరీ ఎక్కువ రోజులు వెయిట్ చేయించకుండా త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. స్వాతంత్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు సమాచారం. దీంతో పాటే టైటిల్ కూడా ఫిక్స్ చేసే అవకాశముంది. ఇప్పటికే ఇంజనీర్ బాబు, పరదేశ ప్రయాణం లాంటి పేర్లు వినిపించినా..ఫైనల్ గా గోకుల కృష్ణుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటి ఖుష్బూ కీలకపాత్ర పోషిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి
సంగీతం అందిస్తున్నారు. ధనుష్ తో కొలవెరి పాటతో దేశమంతా సంచలనం సృష్టించిన అనిరుధ్ పవన్ కళ్యాణ్ చేతా ఆ స్థాయిలో ఈ సినిమా కోసం ఓ పాట పాడించాలని భావిస్తున్నారట.