బాల‌య్య‌ను వ‌ద‌ల‌ని ముగ్గురు సెంటిమెంట్‌

Balakrishna three Heroine Sentiment in Movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ‌…హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌క నిర్మాత‌లు అన్న తేడా లేకుండా ఎక్కువమంది ఈ సెంటిమెంట్ల‌ను పాటిస్తుంటారు. 102వ చిత్రం చేస్తున్న బాల‌య్యకూ ఈ సెంటిమెంట్లు ఉన్నాయి. ఒక‌ప్పుడు ముగ్గురు హీరోయిన్లు ఉంటే ఆ సినిమా  బాక్సాఫీసు రికార్డులు తిరగ‌రాస్తుంద‌ని బాలకృష్ణ‌, ఆయ‌న అభిమానులూ న‌మ్మేవారు.

స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ నాయుడు అలానే సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేశాయి. అయితే కొన్నేళ్ల నుంచి బాల‌కృష్ణ ఈ సెంటిమెంటును ప‌క్క‌న బెట్టారు. ఒక‌రిద్ద‌రు హీరోయిన్ల‌తోనే ఆడిపాడుతున్నారు. తాజాగా పైసా వ‌సూల్ లో మాత్రం మ‌ళ్లీ శ్రీయ‌, ముస్కాన్ సేథీ, కైరాద‌త్ ల‌కు అవ‌కాశ‌మిచ్చిన బాల‌య్య కొత్త చిత్రంలోనూ అదే సెంటిమెంటు కొన‌సాగిస్తున్నారు. కె. ఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఇప్ప‌టికే మెయిన్ హీరోయిన్ గా న‌య‌న‌తారను ఎంపిక చేశారు.

ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. పైసా వ‌సూల్ సినిమా షూటింగ్ పూర్తికాగానే విరామ‌మేమీ తీసుకోకుండానే బాల‌య్య కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.