కార్తికేయ హీరోగా పాయల్ హీరోయిన్గా తెరకెక్కిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఊహించని విజయాన్ని దక్కించుకుని, భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రంలో నటించిన పాయల్కు వరుసగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈమెను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న చిత్రంలో ఇప్పటికే కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా పాయల్ను ఎంపిక చేయడం జరిగింది. బెల్లంకొండ మూవీ అంటే భారీగా ఉంటుంది. హీరోయిన్స్ పారితోషికం కూడా భారీగానే ఉంటుంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు కాజల్ ఏకంగా రెండు కోట్లకు పైగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక పాయల్ కూడా భారీ మొత్తంలో తీసుకోబోతుందని తెలుస్తోంది.
తన మొదటి సినిమాకు పాయల్ కేవలం 5 లక్షల పారితోషికం మాత్రమే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరో పది లక్షల రూపాయలు ఆమెకు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా పాయల్కు ‘ఆర్ఎక్స్100’ చిత్రంతో కేవలం 15 లక్షల రూపాయల పారితోషికం అందింది. అయితే ఇప్పుడు బెల్లంకొండ మూవీలో నటించబోతున్నందుకు ఏకంగా 75 లక్షల రూపాయలను ఆమె తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. బోల్డ్గా నటించడంతో పాటు, ముద్దు సీన్స్కు కూడా ఓకే చెప్పడం వల్లే ఈ రేంజ్లో పాయల్కు పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం సక్సెస్ అయితే పాయల్ రేంజ్ మరింతగా పెరగడం ఖాయం.