మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడిక్ రూరల్ డ్రామా ‘పెద్ది’ (Peddi). దర్శకుడు సుకుమార్తో చేసిన ‘రంగస్థలం’ తర్వాత అదే గ్రామీణ వాతావరణంలో, భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మేకర్స్ మాత్రం ఈ చిత్రాన్ని మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. తాజాగా రిలీజైన ట్రైలర్లో కూడా చరణ్ను స్పోర్ట్స్మ్యాన్గా చూపిస్తూ, అసలు కథను దాచిపెట్టారు. దీంతో సినిమా మొత్తం క్రీడల నేపథ్యంపైనే నడుస్తుందనే భావన బలంగా నెలకొంది. కానీ దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ మాత్రం అంతకంటే లోతుగా ఉందని తెలుస్తోంది.
స్పోర్ట్స్ కంటే ‘రైల్వే ట్రాక్’దే అసలు దారి?
‘పెద్ది’లో స్పోర్ట్స్ కేవలం ఒక భాగమే తప్ప, సినిమా ఆత్మ మాత్రం ఓ ‘రైల్వే ట్రాక్’ అంశం చుట్టూనే తిరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా విడుదలైన కొత్త పోస్టర్లో రైల్వే ట్రాక్ను సింబాలిక్గా చూపించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. సినిమాలో పలు రకాల క్రీడలు కనిపించినా, పెద్ది పోరాటం మాత్రం తన ఊరి అస్తిత్వం కోసం, రైల్వే ట్రాక్కు సంబంధించిన సమస్య చుట్టూనే సాగుతుందని అర్థమవుతోంది. ఇదే క్రమంలో పెద్ది ఢిల్లీకి వెళ్లడం, అక్కడ పోరాటం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది.
మొదటి నుంచే బుచ్చిబాబు ఇచ్చిన క్లూస్
సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అన్నింటిలోనూ ట్రైన్, రైల్వే ట్రాక్కు సంబంధించిన విజువల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఒక పోస్టర్లో చరణ్ రైల్వే ట్రాక్పైనే నిల్చున్నాడు. ట్రైలర్లో కూడా ఓపెనింగ్ షాట్ అదే ట్రాక్తో మొదలవుతుంది. ఇవన్నీ యాదృచ్ఛికంగా కాదు, కథలో కీలకమైన అంశానికి ముందుగానే ఇచ్చిన హింట్స్గా కనిపిస్తున్నాయి.
ఈ హింట్స్ అన్నీ థియేటర్లలో సరైన ఎమోషన్తో వర్క్ అయితే, రామ్ చరణ్ నుంచి మరో పవర్ఫుల్, ఇంటెన్స్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. బుచ్చిబాబు అసలు ప్లాన్ ఏంటో పూర్తిగా అర్థం కావాలంటే మాత్రం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.
