Political Updates: కరాచీ బేకరీలో పేలుడు.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

Political Updates: Explosion in Karachi bakery.. CM Revanth Reddy shocked
Political Updates: Explosion in Karachi bakery.. CM Revanth Reddy shocked

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గగన్ పహాడ్ లోని ఓ బేకరీ కిచెన్ లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు.

ప్రమాదం ఎలా జరిగిందనే విషయం, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. బేకరీలో పనిచేసేవారు మాత్రమే గాయపడ్డారా? లేక కస్టమర్లు కూడా ఉన్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సిఉంది. కాగా, ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.