‘సాహో’ కంటే ముందు బాలీవుడ్‌లో..!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Prabhas will be in a guest role upcoming Hindi film Khamoshi 

Prabhas Will Be In A Guest Role Upcoming Hindi Film Khamoshi

ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రం ఏంటి అంటే ప్రతి ఒక్కరు ‘సాహో’ అని చెప్తారు. అయితే ‘సాహో’ చిత్రంతో పాటు బాలీవుడ్‌లో ఒక చిత్రాన్ని చేసేందుకు ప్రభాస్‌ కమిట్‌ అయ్యాడు. బాలీవుడ్‌లో చేయబోతున్న సినిమా పూర్తి లెంగ్త్‌ ఉన్న పాత్రలో కాదు, గెస్ట్‌ పాత్రలో ప్రభాస్‌ కనిపించబోతున్నాడు. తమన్నాతో ప్రభాస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా తమన్నా నటించిన విషయం తెల్సిందే. రెండవ పార్ట్‌లో తమన్నాకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. ఆ విషయంలో ప్రభాస్‌ ఆమెపై సానుభూతితో ఉన్నాడు. ఆ సానుభూతిని తమన్నా ఉపయోగించుకుని తను ప్రస్తుతం నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘ఖామోషీ’లో ప్రభాస్‌ను నటింపజేసేందుకు సిద్దం అయ్యింది. సౌత్‌ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన స్టార్‌ సినిమాటోగ్రఫర్‌ ప్రభుదేవ దర్శకత్వంలో తమన్నా హీరోయిన్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒక ముఖ్యమైన గెస్ట్‌ రోల్‌లో బాలీవుడ్‌ స్టార్‌ను ప్రభుదేవ నటింపజేయాలని భావించాడు.

అయితే ఆ పాత్రలో ప్రభాస్‌ అయితే బాగుంటాడు అని తమన్నా భావించింది. అందుకు ప్రభుదేవా కూడా ఓకే చెప్పాడు. ప్రభాస్‌ను సంప్రదించడం, ఓకే చెప్పడం, వచ్చే నెలలో షూటింగ్‌లో పాల్గొనేందుకు ఓకే చెప్పడం అన్ని చకచక జరిగి పోయాయి. ఈ సంవత్సరం చివర్లో బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు ‘ఖామోషీ’తో ప్రభాస్‌ వెళ్లనున్నాడు, ‘సాహో’ చిత్రం వచ్చే సంవత్సరం వేసవి కానుకగా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు