డియ‌ర్ ప్రైమ్ మినిష్ట‌ర్…. కుక్క‌లు ఓట్లు వేయ‌వు క‌దా…!

Prakash Raj questions Modi Dogs Can't Votes in elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

క‌ర్నాట‌క ఎన్నిక‌ల వేళ ప్ర‌ధాని మోడీపై ప్ర‌కాశ్ రాజ్ విమ‌ర్శ‌ల దాడి తీవ్ర‌త‌రం చేశారు. స‌భ‌లు, ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల్లోనే కాదు… ట్విట్ట‌ర్ వేదిక‌గానూ ప్ర‌ధానిపై మండిప‌డుతున్నారు. తాజాగా మోడీని ఉద్దేశించి ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్లు చేశారు. డియ‌ర్ ప్రైమ్ మినిష్ట‌ర్… మ‌నుషుల క‌న్నా… ముధోల్ శున‌కాలు బాగా ప‌నిచేస్తాయ‌ని… వాటిని ఆర్మీలో రిక్రూట్ చేసుకునే విష‌య‌మై చ‌ర్చిస్తాన‌ని మీరు అన్నారు. అయితే కుక్క‌లు ఓట్లు వేయ‌వు క‌దా… అని ప్ర‌కాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కోసం యువ‌త క‌ల‌లు కంటోంద‌ని వ్యాఖ్యానించారు.

రైతులు ఆవేద‌న‌లో ఉన్నార‌ని, ఓటు వేయ‌డం ద్వారా మెరుగైన జీవితాన్ని పౌరులు కోరుకుంటున్నార‌ని చెప్పారు. కర్నాట‌క ప్ర‌జ‌లు అంతా గ‌మ‌నిస్తున్నార‌ని, తాము ఏమైనా కుక్క‌ల మాదిరి బ‌తుకుతున్నామ‌ని మీరు అనుకుంటున్నారా…? జ‌స్ట్ ఆస్కింగ్… అని మోడీపై ప్ర‌కాశ్ రాజ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. మరో ట్వీట్ లో ఏ మేరకు అబ‌ద్ధాలు ఆడ‌తారు సార్… విద్యుత్ తో కాదు… మీరు చెప్పే అబ‌ద్ధాల‌తో మ‌మ్మ‌ల్ని షాక్ కు గురిచేస్తున్నారు. మీకో సింపుల్ ప్ర‌శ్న వేస్తున్నా… దేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీరు మ‌ర్చిపోయారు. పౌరులు ప్ర‌శ్నిస్తే ఏం స‌మాధానం చెబుతారు…? క‌నీసం ఇప్ప‌టివ‌ర‌కు మీరు ఎన్ని అబ‌ద్ధాలు చెప్పారో ఆ సంఖ్య అయినా గుర్తుందా అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

Praksh raj tweet on Modi