Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, మహేష్బాబుల కాంబినేషన్లో ‘పోకిరి’ మరియు ‘బిజినెస్మన్’ చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా పోకిరి చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని అప్పట్లో సంచలన కలెక్షన్స్ను రాబట్టి, రికార్డులు బ్రేక్ చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా ‘జనగణమన’ చిత్రం తెరకెక్కబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన స్వయంగా పూరి జగన్నాధ్ చేయడం జరిగింది. మహేష్బాబుతో జనగణమన చిత్రాన్ని చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే ఆ సినిమాపై మహేష్బాబు ఆసక్తి చూపడం లేదని, దాంతో ఆ ప్రాజెక్ట్ను మరో హీరోతో చేయాలని పూరి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా తన కొడుకు ఆకాష్ పూరితో ‘మెహబూబా’ అనే చిత్రాన్ని పూరి జగన్నాధ్ తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. తన కొడుకుకు స్టార్ ఇమేజ్ను తెచ్చి పెట్టేందుకు దర్శకుడు పూరి మరో సినిమాను ఆకాష్తో చేయాలని నిర్ణయించుకున్నాడు. మెహబూబా చిత్రం ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కింది. ఇండియా, పాక్ల బోర్డర్ వద్ద జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రంను రూపొందించడం జరిగింది. ఇక తన కొడుకు ఆకాష్తో పూరి చేయబోతున్న రెండవ సినిమా జనగణమన అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మహేష్బాబు కోసం అనుకున్న కథను చిన్న చిన్న మార్పులు చేసి ఆకాష్ కోసం వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆకాష్ జనగణమన వచ్చే అవకాశం ఉంది.