కుల చిచ్చు రేపమంటున్న ప్రశాంత్ …జగన్ కళ్ళు తెరవడా?

Prashant Team Doing Field Survey For Jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద్యాల,కాకినాడ ఉప ఎన్నికల ఫలితాలు చూసాక వైసీపీ శ్రేణులు, నాయకులు, వ్యూహకర్త, అధినేత అంతా ఆత్మశోధన చేసుకుంటారని అంతా భావించారు. నిజానికి వైసీపీ శ్రేణులు కోరుకుంది కూడా అదే. వట్టి మాటలు కట్టిపెట్టి నిజమైన ఆత్మశోధనతో మళ్లీ పార్టీని గాడిన పెట్టే సరికొత్త అస్త్రాలతో వైసీపీ రంగంలోకి దిగుతుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. అయితే వారి ఆశలు ఆకాశంలో ఉంటే హైకమాండ్ చేతలు పాతాళంలో వున్నాయి. తాజాగా వైసీపీ కి కొమ్ము కాసే ఓ గొప్ప వెబ్ సైట్ వెల్లడించిన దాని ప్రకారం ఆ పార్టీ కొత్త అస్త్రం సిద్ధం అయ్యిందట. దాన్ని ఎప్పుడు విడుదల చేయాలో నిర్ణయించడమే ఇక మిగిలిఉందట. ఇంతకీ 100 కోట్లకి పైగా తీసుకుంటున్న ఆ పార్టీ వ్యూహకర్త చెప్పిన కొత్త వ్యూహం ఏమిటంటే మరోసారి కుల చిచ్చు రేపడమే. టీడీపీ హయాంలో కమ్మలకి ప్రాధాన్యం లభిస్తోందని ఓ జాబితా విడుదల చేస్తారట. దాంతో ఏపీ లో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోతుందని ప్రశాంత్ అనుకుంటున్నారట.ఈ కులపరమైన వ్యూహాలు ఇటు నంద్యాల, అటు కాకినాడల బెడిసికొట్టిన విషయం ఇంకా జనం మదిలో ఉండగానే అదే అస్త్రంతో మళ్లీ వైసీపీ రెడీ అవ్వడం చూస్తుంటే ఆ పార్టీ రాజకీయ అపరిపక్వత స్పష్టంగా కనిపిస్తోంది.

మరీ ముఖ్యంగా కాకినాడలో ముద్రగడ ద్వారా కాపులని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. జనం కులాన్ని పట్టించుకుంటారేమో గానీ దాన్ని మాత్రమే పట్టించుకోరని ఈ ఎన్నికలతో తెలిసిపోయింది. అయినా బాగా చదువుకున్నవాళ్ళు, ఐఐటీ విద్యార్థులు మాతో పని చేస్తారని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ ఓ వైఫల్యం తర్వాత కూడా ఇంత చౌకబారు వ్యూహాలు పన్నడం చూస్తుంటే జగన్ ఎంపిక తప్పు అనిపిస్తోంది. అయినా స్థానిక రాజకీయాల కోసం ఎక్కడి నుంచో వచ్చిన వారి సలహాలు పని చేయవని ప్రత్యేకంగా చెప్పాలా ? ఇప్పుడు కూడా కులాన్ని ఎన్నికల అస్త్రంగా మలుస్తానని చెప్తున్న ప్రశాంత్ కిషోర్ ని వదిలించుకోడానికి జగన్ ముందుకొస్తే మంచిది. ఇప్పటికీ కళ్ళు తెరవకపోతే 2019 ఎన్నికల తర్వాత పోస్ట్ మార్టం చేద్దామన్నా పార్టీ ఉండదు. నాయకులు అంతకన్నా వుండరు.

మరిన్ని వార్తలు:

అందుకే… సామాజిక స్మ‌గ్ల‌ర్లు అన్నాను…

క‌న్నీరు పెట్టిస్తున్న చిన్నారి వీడియో