పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘ధూం ధాం’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Pure mass entertainer 'Dhoom Dham' release date fixed!
Pure mass entertainer 'Dhoom Dham' release date fixed!

యువ నటీనటులు చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా ఒక పండుగలా తెరకెక్కించిన పక్కా ఎంటర్టైనర్ మూవీ నే “ధూం ధాం”. మరింత మంది ప్రముఖ నటులు సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రల ల్లో నటించిన ఈ కలర్ ఫుల్ మూవీ కి మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఇది వరకే రిలీజ్ కు రావాల్సి ఉన్నది కానీ కొంతమేర ఎంటర్టైన్మెంట్ ను వాయిదా వేశారు.

Pure mass entertainer 'Dhoom Dham' release date fixed!
Pure mass entertainer ‘Dhoom Dham’ release date fixed!

మరి ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఇచ్చేసారు. దీనితో ఈ మూవీ నవంబర్ 8న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సో ఈ పండుగ లాంటి ఎంటర్టైనర్ నవంబర్ లో మొదలు కానున్నది అని చెప్పాలి. ఇక ఈ మూవీ ని సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పి వారు రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు గోపి సుందర్ సంగీతం అందించగా ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ వారు నిర్మాణం వహించారు.