వింతగా మాట్లాడుతున్న పూరి

Puri Jagannadh Sensational Comments On Telugu News Media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దర్శకుడు పూరి జగన్నాద్‌కు డ్రగ్స్‌ డీలర్‌ కెల్విన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని, అలాగే డ్రగ్స్‌ అలవాటు ఉన్నట్లుగా అనుమానాలున్న సిట్‌ అధికారులు తాజాగా ఆయన్ను విచారించిన విషయం తెల్సిందే. పూరి జగన్నాధ్‌ను సిట్‌ అధికారులు ఏకంగా 11 గంటల పాటు విచారించడంతో పూరిపై అనుమానాలు అందరిలో పెరుగుతున్నాయి. పూరికి డ్రగ్స్‌ అలవాటు ఉందని సినీ వర్గాల వారు కూడా కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థతో పూరి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

పూరి మాట్లాడుతూ.. తనపై మీడియాలో వస్తున్న వార్తలకు తన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారని, తాను బ్యాంకాక్‌ వెళ్లినంత మాత్రాన డ్రగ్స్‌ అలవాటు ఉన్నట్లుగా ఎలా భావిస్తారు అంటూ మీడియాను పూరి ప్రశ్నించాడు. తాను 15 సంవత్సరాలుగా బ్యాంకాక్‌కు వెళ్తున్నాను అక్కడకు వెళ్లిన ప్రతి సారి తాను ఒకే ఆమెతో మసాజ్‌ చేయించుకుంటాను. ఆమె వయస్సు 55 ఏళ్లు, ఆమెకు తన కుటుంబ సభ్యులు కూడా చాలా పరిచయం అంటూ పూరి చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్‌ రాసేందుకు మాత్రమే తాను బ్యాంకాక్‌ వెళ్తాను అంటూ చెప్పుకొచ్చాడు. తనకు వ్యక్తిగతంగా విరోధులు ఎవరు లేరని, కాని తనపై ఎవరో కావాలని ఇలా చెడు ప్రచారం చేయిస్తున్నారు అనే అనుమానం వస్తుంది అంటూ వింతగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. పూరి జగన్నాధ్‌ను బ్యాడ్‌ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు, ఆయన సినిమా పరిశ్రమలో అందరితో సన్నిహితంగానే ఉంటాడు. పోలీసులు అనుమానిస్తున్నారు కనుక మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతే తప్ప పూరి గురించి ఎవరు తప్పుగా ప్రచారం చేయడం లేదని కొందరు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

దండుపాళ్యం 2… తెలుగు బులెట్ రివ్యూ

రెబల్‌స్టార్‌ కాదు.. బ్లాక్‌ బస్టర్‌ కింగ్‌