Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్నాళ్లుగా సందడి లేని రాజశేఖర్ సినీ కెరీర్ లో గరుడ వేగ సినిమా ఓ మెరుపులా వచ్చింది. రేపు ఆ సినిమా సక్సెస్ అవుతుందో, లేదో తర్వాత విషయం గానీ ఆయనకి కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. రాజశేఖర్ తో 5 కోట్లు పెట్టి సినిమా తీసినా వెనక్కి రావనుకునే రోజుల్లో 25 కోట్లు పెట్టి సినిమా తీయడమే ఓ సంచలనం. ఇక గరుడ వేగ ట్రైలర్ విడుదల అయ్యాక అప్పటిదాకా కనిపించిన పెదవి విరుపులు కూడా ఆగిపోయాయి. ఈసారి రాజశేఖర్ నుంచి మేటర్ వున్న సినిమా రాబోతోంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ మేజిక్ వెనుక వున్న పిల్లర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇక వ్యక్తిగతంగా కూడా రాజశేఖర్ జీవితంలో కొన్ని భావోద్వేగ సంఘటనలు జరిగాయి. గరుడ వేగ కి వస్తున్న క్రేజ్ చూసి సంతోషించేంతలో ఆయన తల్లి చనిపోవడం తీవ్ర విషాదం.
ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కి నందమూరి బాలయ్య రావడం ఓ విశేషం. ఆపై రాజశేఖర్ ఇంకో సంచలనానికి తెరదీశారు. ఒకప్పుడు తమతో ఎన్నో విభేదాలు వున్న మెగా స్టార్ చిరంజీవి ఇంటికి స్వయంగా వెళ్లారు. గరుడ వేగ ప్రీమియర్ షో చూడాలని ఆహ్వానించారు. అటు చిరు సైతం రాజశేఖర్ ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా చూస్తానని చెప్పడమే కాకుండా ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ సూపర్ గా ఉందని పొగిడారు. మొత్తానికి ఈ కలయిక టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది.