ఆర్‌ మల్టీస్టారర్‌ ముహూర్తం ఫిక్స్‌

Ram Charan and NTR Multistarrer movie Launch date

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత చేయబోతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు కలిసి నటించబతున్న ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రంకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అవ్వడానికి వచ్చింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను కూడా పూర్తి చేసేందుకు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక వైపు సెట్స్‌ నిర్మాణం చేయిస్తూనే మరో వైపు లొకేషన్స్‌ ఎంపిక కూడా చేస్తున్నాడు. మరో వైపు హీరోయిన్స్‌ను మరియు ఇతర నటీనటులను ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా బిజీగా ఉన్నారు. ఇంత హడావుడి జరుగుతున్న ఈ చిత్రం చిత్రీకరణ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదట నవంబర్‌లో అనుకున్నప్పటికి రామ్‌ చరణ్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అప్పటికి పూర్తి అవ్వడం లేదు. అందుకే కాస్త ఆలస్యం అంటే నంబర్‌లో అనుకున్నది డిసెంబర్‌లో ప్రారంభించాలని జక్కన్న నిర్ణయించుకున్నాడు. ఇక సెప్టెంబర్‌తో ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తున్న చిత్రం పూర్తి అవ్వబోతుంది. అక్టోబర్‌ నుండి డిసెంబర్‌ వరకు మల్టీస్టారర్‌ చిత్రం కోసం రెడీ అవ్వబోతున్నాడు. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు చాలా ప్రత్యేకంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రాన్ని దానయ్య దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మరో హీరోయిన్‌ పాత్రకు అదితి రావును ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. 2020 వేసవిలో చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.