ఏపీని మోడీ లైట్ తీసుకోడానికి ఇదే కారణం.

ram gopal varma tweets AP tdp mps
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకో వివాదంలోకి అడుగు పెట్టాడు. కేంద్రం లోని మోడీ సర్కార్ , రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం చేతల దాకా వస్తున్న ఈ తరుణంలో రాము కామెంట్స్ అందర్నీ ఆలోచనలో పడేశాయి. ప్రత్యేక హోదా సహా విభజన చట్టం లో అంశాల అమలుకు డిమాండ్ చేస్తూ చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ వేస్తున్న విచిత్ర వేషధారణలకు సంబంధించిన ఫోటో పెట్టిన రాము, ఇలాంటి జోకర్ల వల్లే ప్రధాని మోడీ ఆంధ్ర ని లైట్ తీసుకుంటున్నారని కామెంట్ చేసాడు.

RGV Tweets On Tdp Mps

ఈ ఫొటోలో ఒక్క శివప్రసాద్ మాత్రమే కాదు ..పార్లమెంట్ లో ఆంధ్ర సమస్యల మీద గట్టిగా గళం ఎత్తిన , ఎత్తగలిగిన యువ ఎంపీలు గల్లా జయదేవ్ , రామ్మోహన్ నాయుడు , మురళి మోహన్ కూడా వున్నారు. నటులు మురళీమోహన్ , శివప్రసాద్ విషయం ఎలా వున్నా లోక్ సభలో పార్టీ గళాన్ని బలంగా వినిపిస్తున్న జయదేవ్ , రామ్మోహన్ ని కూడా కలిపి రాము జోకర్లుగా అభివర్ణించడం ఎటు దారి తీస్తుందో చూడాలి. అయితే ఎవరు ఏమి కామెంట్ చేసినా రాము పెద్దగా పట్టించుకోడు అన్నది తెలిసిందే. పైగా ఎదుటి వాళ్ళు ఒక్కటి అంటే తాను పది అనడానికి రెడీగా ఉంటాడు.