ఎవ‌రి జీవిత‌మ‌న్నా ఇంతా విషాదంగా ముగుస్తుందా…?

Ram Gopal Varma Worried About On Sridevi Dead

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ్రీదేవి వివాదాస్ప‌ద మ‌ర‌ణంపై వ‌స్తున్న వార్త‌లు చూసి ఆమె అభిమాని, ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తంచేశాడు. శ్రీదేవి జీవించి ఉన్న‌ప్పుడు ఆమె అందం, శ‌రీరం, హావ‌భావాలు, పెదాలు, న‌డుము గురించి మాట్లాడుకునేవార‌ని… కానీ ఇప్పుడు ఏవేవో మాట్లాడుకుంటున్నార‌ని వ‌ర్మ వాపోయాడు. ఆమె ర‌క్తంలో మ‌ద్యం ఉంద‌ని, ఊపిరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయ‌ని, పొట్ట‌లో ఇంకేవో ఉన్నాయ‌ని అంటున్నార‌ని, ఎవ‌రి జీవిత‌మ‌న్నా… ఇంత భ‌యంక‌రంగా, ఇంత విషాదంగా ముగుస్తుందా…? ఆమె మ‌ర‌ణ‌వార్త‌ను ఇన్ని ర‌కాలుగా వినాల్సిరావ‌డం బాధాక‌ర‌మ‌ని, ఇదంతా చూస్తుంటే న‌న్ను నేను చంపుకోవాలనిపిస్తోందని వ‌ర్మ ట్వీట్ చేశాడు.

రామ్ గోపాల్ వ‌ర్మే కాదు… శ్రీదేవి మ‌ర‌ణంపై త‌లెత్తుతున్న సందేహాలు దేశ‌ప్ర‌జ‌లంద‌రికీ ఆవేద‌న క‌లిగిస్తున్నాయి. ఆమె హ‌ఠాన్మ‌ర‌ణం వార్త వినే అంద‌రూ శోకసంద్రంలో మున‌గ‌గా… ఆ మ‌ర‌ణం స‌హజ మ‌ర‌ణం కాద‌ని… ఏదో కుట్ర జ‌రిగింద‌ని వ‌స్తున్న వార్త‌లు అంద‌రినీ ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. మ‌ర‌ణించి మూడు రోజులు గ‌డిచినా ఆమె మృత‌దేహం ఇంకా స్వ‌దేశానికి రాక‌పోవ‌డం, అస‌లు దుబాయ్ లో ఏం జ‌రుగుతోందో తెలియ‌క‌పోవ‌డం అయోమ‌యంగా మారింది.