టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ Ranabaali. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ ఆసక్తికరమైన అప్డేట్ను అధికారికంగా వెల్లడించారు.
కొన్ని నెలల క్రితం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జోడీకి సంబంధించిన స్పెషల్ సాంగ్ బిట్గా ‘ఏందయ్యా సామి’ పాటలోని కొంత భాగాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో పూర్తి పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు ఈ అవైటెడ్ సాంగ్ ఫుల్ వెర్షన్ రిలీజ్ డేట్ను మేకర్స్ ఖరారు చేశారు. ‘ఏందయ్యా సామి’ పూర్తి పాటను సెప్టెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ పాట ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కాంబినేషన్కు ఇప్పటికే ఉన్న క్రేజ్కు ఈ పాట మరింత హైప్ తీసుకురావడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మొత్తానికి ‘రణబాలి’ నుంచి ఫస్ట్ సింగిల్కు డేట్ ఫిక్స్ కావడంతో సినిమా ప్రమోషన్స్ మరింత జోరందుకునేలా కనిపిస్తున్నాయి. మరి సెప్టెంబర్ 21న విడుదల కానున్న ‘ఏందయ్యా సామి’ ఫుల్ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటుందో చూడాలి.





