Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ సంవత్సరం మొదలై మూడు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మంచి సక్సెస్ సినిమా రాలేదు. పలు చిత్రాలు విడుదలైనా కూడా ఒక్క చిత్రం కూడా విజయాన్ని సొంతం చేసుకోలేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత కూడా విడుదలైన చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. వరుసగా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్న సమయంలో రాబోతున్న చిత్రం అవ్వడంతో ‘రంగస్థలం’పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో సినిమా అంటే సాదారణంగా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ సినిమా అవ్వడంతో భారీ ఎత్తున బిజినెస్ అయ్యింది.
సమ్మర్ కానుకగా వస్తున్న చిత్రం అవ్వడంతో పాటు, పరీక్షలు పూర్తి అవ్వడం మరియు వేసవి సెలవులు అవ్వడంతో సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తాయనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బడ్జెట్ చిత్రాలు లేక పోవడంతో ‘రంగస్థలం’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 90 శాతం థియేటర్లలో ప్రదర్శణకు సిద్దం చేస్తున్నారు. ఇక ఓవర్సీస్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. దాంతో రంగస్థలం మొదటి రోజు 40 కోట్ల వసూళ్లు సాధిస్తాయనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్లో మొదటి రోజే 1.5 మిలియన్ డాలర్లను వసూళ్లు చేస్తుందని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ను షురూ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రంగస్థలం రికార్డు ఓపెనింగ్స్ను సాధించడం ఖాయం అని తేలిపోయింది.