బ్యాంకు ఖాతాదారులకి ఆర్బీఐ శుభవార్త

rbi good news for bank account holders

భారతీయ రిజర్వు బ్యాంక్ ఖాతాదారుల కోసం గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్‌బీడీఏ) ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది.  ఈ మేరకు నిన్న ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు  విత్‌ డ్రాలపై నిబంధనలను కూడా  సడలించింది.  నెలకు  4 సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్ చేసుకునే సదుపాయంతో పాటు  ఉచిత ఏటీఎం లేదా డెబిట్ కార్డు జారీ చేయనుంది, అలాగే యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని ఆదేశించింది.  ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఇప్పుడు కేంద్ర బ్యాంకు తొలగించింది.  వీరికి కనీస సదుపాయాలకు తోడు చెక్‌బుక్‌తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఇప్పుడు ఆర్బీఐ కల్పించింది. అయితే ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు గాను వారినుంచి మినిమం బాలెన్స్‌ చార్జీలు వసూలు చేయరాదని కూడా ఆర్‌బీఐ పేర్కొంది