Sai Pallavi: చూడటానికి సాఫ్ట్‌గా ఉంటుంది కానీ.. సాయి పల్లవిపై నాగశౌర్య షాకింగ్ కామెంట్స్!

Sai Pallavi: చూడటానికి సాఫ్ట్‌గా ఉంటుంది కానీ.. సాయి పల్లవిపై నాగశౌర్య షాకింగ్ కామెంట్స్!
Sai Pallavi: చూడటానికి సాఫ్ట్‌గా ఉంటుంది కానీ.. సాయి పల్లవిపై నాగశౌర్య షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్‌లో సాయి పల్లవికి (Sai Pallavi) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన సహజమైన నటన, డ్యాన్స్‌తో పాటు గ్లామర్‌కు దూరంగా ఉంటూ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి.. తొలి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. పక్కింటి అమ్మాయి తరహా లుక్‌తో పాటు తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా మంచి కథలు, బలమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకోవడం సాయి పల్లవి ప్రత్యేకతగా మారింది. దీంతో అభిమానులు ఆమెను ‘లేడీ పవర్ స్టార్’ అని కూడా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి.. తెలుగులో చివరిగా ‘తండేల్’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణం’లో సీత పాత్రలో నటిస్తోంది.

సాయి పల్లవి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటూ తన సినిమాలపైనే ఫోకస్ చేస్తుంటుంది. అయితే గతంలో ఆమెపై యంగ్ హీరో నాగశౌర్య చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆ పాత వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగశౌర్య, సాయి పల్లవి కలిసి ‘కణం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సమయంలో సాయి పల్లవి ప్రవర్తనపై నాగశౌర్య కొన్ని అసంతృప్తికర వ్యాఖ్యలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. షూటింగ్‌కు ఆలస్యంగా రావడం, సెట్‌లో కొంత యాటిట్యూడ్ చూపించడం వంటి విషయాలపై ఆయన మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా తాను కలిసి పనిచేసిన హీరోయిన్లలో సాయి పల్లవి తనకు కొంత ఇబ్బంది కలిగించిన హీరోయిన్ అని నాగశౌర్య వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ వ్యాఖ్యలపై సాయి పల్లవి కూడా స్పందించింది. తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే తాను బాధపడతానని చెప్పిన ఆమె.. నాగశౌర్య చేసిన వ్యాఖ్యలు తనను బాధపెట్టాయని వెల్లడించింది. వెంటనే ‘కణం’ దర్శకుడితో పాటు సినిమాటోగ్రాఫర్‌కు ఫోన్ చేసి, తన వల్ల షూటింగ్ సమయంలో ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగినట్లు తెలిపింది. వారు అలాంటిదేమీ లేదని చెప్పడంతో తాను కాస్త ప్రశాంతంగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది.

అంతేకాదు, నాగశౌర్యపై తనకు మంచి అభిప్రాయం ఉందని, ఆయన నటన తనకు నచ్చుతుందని కూడా సాయి పల్లవి పేర్కొంది. తనలో నచ్చిన విషయాలను చాలామంది చెబుతుంటారని, అయితే శౌర్య తనలో నచ్చని విషయాన్ని చెప్పాడని, దాన్ని కూడా పాజిటివ్‌గానే తీసుకున్నానని ఆమె చెప్పింది.

ఇవి చాలా కాలం క్రితం జరిగిన పరిణామాలు, పాత వ్యాఖ్యలే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో పాత వీడియోలు, ఇంటర్వ్యూలు వైరల్ అవుతుండటంతో ఈ విషయం మరోసారి చర్చలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం సాయి పల్లవి తన కెరీర్‌లో వరుస భారీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది.