నిర్మాత‌గా అక్కినేని స‌మంత‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హీరోగా విజ‌యవంతంగా కెరీర్ కొన‌సాగుతుండ‌గానే తండ్రి బాట‌లో ప్రొడ్యూస‌ర్ అవ‌తార‌మెత్తాడు అక్కినేని నాగార్జున‌. త‌న సినిమాలు కొన్నింటిని తానే స్వ‌యంగా నిర్మించి ఘ‌న‌విజ‌యాల‌ను సొంతం చేసుకుని పేరు, డ‌బ్బూ రెండూ స‌మ‌కూర్చుకున్నాడు. ఇప్పుడు ఆయ‌న కోడ‌లు స‌మంత కూడా మామయ్య బాట‌లోనే న‌డుస్తోంది. ఇటీవ‌లే అక్కినేని వారి ఇంటి కోడ‌లైన స‌మంత అప్పుడే ఆ కుటుంబం ల‌క్ష‌ణాల‌ను అందిపుచ్చుకుంటోంది. తెలుగు, త‌మిళంలో అనేక భాష‌ల్లో న‌టించి రెండు చేతులా సంపాదించిన స‌మంత ఇప్ప‌టిదాకా న‌టించామా, వెళ్లామా అన్న‌ట్టే ఉండేది. న‌ట‌న మినహా ఇత‌ర ఏ అంశాల్లోనూ జోక్యం చేసుకునేదికాదు. కానీ నాగ‌చైత‌న్య‌ను పెళ్లిచేసుకుని ఇలా అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టిందో లేదో అప్పుడే నిర్మాత‌గా అవ‌తార‌మెత్తేందుకు సిద్ధ‌మైంది. ఇందుకోసం ఓ క‌న్న‌డ హిట్ మూవీ రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని స‌మాచారం.

U-Turn-movie

క‌న్న‌డ‌లో యూట‌ర్న్ అనే మిస్ట‌రీ మూవీ 2016లో భారీ స‌క్సెస్ అందుకుంది. ఈ సినిమాను రీమేక్ చేయాల‌ని అక్కినేని స‌మంత‌ భావిస్తోంది. రీమేక్ హ‌క్కుల కోసం స‌మంత భ‌ర్త చైత‌న్య‌తో క‌లిసి ఇటీవ‌ల బెంగ‌ళూరు కూడా వెళ్లారు. తెలుగు, త‌మిళ రెండు భాషల్లో త‌న‌కు మార్కెట్ ఉండ‌డంతో ద్విభాషా చిత్రంగా యూ ట‌ర్న్ రూపొందించాల‌న్న‌ది స‌మంత ప్లాన్. ఇందులో ఆమె జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. క‌న్న‌డ యూట‌ర్న్ కు ద‌ర్శ‌కత్వం వ‌హించిన ప‌వ‌న్ కుమారే రీమేక్ ను కూడా తెర‌కెక్కించ‌నున్నారు. త్వ‌ర‌లోనే చిత్రానికి సంబంధించి ఏర్పాట్లు మొద‌లుపెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం స‌మంత తెలుగులో మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం చిత్రాల్లోనూ, త‌మిళంలో అభిమ‌న్యుడు సినిమాలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. ఈ మూడు సినిమాల షూటింగ్ పూర్తికాగానే… యూట‌ర్న్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. నిర్మాత‌గా మారాలన్న స‌మంత నిర్ణ‌యానికి భ‌ర్త నాగ‌చైత‌న్య‌, మామ‌య్య నాగార్జున పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని ఫిలింన‌గ‌ర్ టాక్.