అల్లు శిరీష్‌ను పట్టించుకునేవారేరి?

allu sirish okka kshanam movie release date postponed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్‌ సక్సెస్‌ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈయన చేసిన ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ తప్ప మిగిలిన ఏ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో తన తాజా చిత్రానికి అల్లు శిరీష్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రేక్షకులు తన నుండి ఎలాంటి సినిమాను అయితే కోరుకుంటున్నారో అలాంటి సినిమాను చేస్తాను అంటూ మొదటి నుండి చెబుతూ వస్తున్న అల్లు శిరీష్‌ ఒక విభిన్న చిత్రంగా ‘ఒక్క క్షణం’ అనే చిత్రాన్ని చేయడం జరిగింది. ప్రయోగాత్మకంగా, విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.

Okka-Kshanam

నిన్న మొన్నటి వరకు సినిమాను క్రిస్మస్‌ కానుకగా సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని ‘ఎంసీఏ’ మరియు ‘హలో’ చిత్రాలు క్రిస్మస్‌కు విడుదల కానున్న కారణంగా సినిమాను డిసెంబర్‌ 28కి వాయిదా వేయడం జరిగింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. ఈ చిత్రం టీజర్‌ విడుదల కాబోతుందన్నా కూడా పెద్దగా ఎదురు చూసే వారు లేకుండా పోయారు. ఇక ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి కనబర్చడం లేదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో అల్లు శిరీష్‌ సినిమాకు బయ్యర్లు దొరకడం లేదు. దిల్‌రాజు తన సినిమా ‘ఎంసీఏ’ కోసం థియేటర్లను బ్లాక్‌ చేసిన నేపథ్యంలో అల్లు వారి అబ్బాయి సినిమాకు థియేటర్లు లేకుండా పోయాయి. అందుకే వారం ఆలస్యంగా సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు విడుదల అయినా కూడా ఈ చిత్రాన్ని పట్టించుకునే వారు ఉంటారా అనేది చూడాలి.

allu-sirish