రెండు సంవత్సరాలకు పూర్తి అయ్యింది

sampoornesh babu About Kobbari Matta Movie

సంపూర్నేష్‌బాబు ‘హృదయ కాలేయం’ చిత్రం విడుదలైన వెంటనే మొదలు పెట్టిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. హృదయకాలేయం చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించిన సంపూర్నేష్‌బాబు ‘కొబ్బరి మట్ట’ చిత్రంను మాత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో ఆలస్యం చేస్తున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం ‘కొబ్బరి మట్ట’ చిత్రాన్ని ప్రకటించారు. మద్య మద్యలో పాట విడుదల చేయడం, పోస్టర్‌లు విడుదల చేయడం చేస్తున్నారు. కాని సినిమా విషయానికి వస్తే మాత్రం ఆలస్యం చేస్తూ వస్తున్నారు. సాయి రాజేష్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘కొబ్బరి మట్ట’ చిత్రం ఎట్టకేలకు విడుదల కాబోతుంది.

తాజాగా ఆ విషయాన్ని సంపూర్నేష్‌బాబు అధికారికంగా ప్రకటించాడు. తాజాగా కొబ్బరిమట్ట చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యిందని, ఆడియో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. సంపూర్నేష్‌బాబు ట్విట్టర్‌ ద్వారా.. సంవత్సరమున్నర కష్టపడి చేశాం అంటూ పోస్ట్‌ చేశాడు. తప్పకుండా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సంపూర్నేష్‌బాబు మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ఒక పాత్రకు ఏకంగా ముగ్గురు భార్యలు ఉంటారు. అలాగే ఈ చిత్రం కోసం సంపూర్నేష్‌బాబు ఒక పాటను కూడా పాడటం జరిగింది. ఆ పాట ఆమద్య భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తెలుగులో ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫన్నీగా పోస్ట్‌లు వేసి ప్రచారం చేస్తున్నారు. సంపూర్నేష్‌బాబు ఈ చిత్రంతో మరోసారి సక్సెస్‌ను అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.