అవి పుకార్లే అంటున్న సంపూ

Sampoornesh Babu Clarifies Rumors On Big Boss Show Fine Amount

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగులో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అయ్యి సక్సెస్‌ఫుల్‌గా దూసుకు పోతున్న ‘బిగ్‌బాస్‌’ షో నుండి అర్థాంతరంగా సంపూర్నేష్‌బాబు బయటకు వచ్చిన విషయం తెల్సిందే. సంపూర్నేష్‌బాబు ఆత్మహత్య యత్నం చేయడంతో బిగ్‌బాస్‌ ఆయన్ను పంపించాడు అనే టాక్‌ వస్తుంది. ఇంకా పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సంపూర్నేష్‌బాబుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మద్యలో వెళ్లి పోయినందుకు గాను ఏకంగా 25 లక్షల నష్టపరిహారంను స్టార్‌ మాటీవీ సంపూర్నేష్‌బాబు నుండి వసూళ్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సంపూకు ఇవ్వాల్సిన పారితోషికం కూడా ఇవ్వలేదని సోషల్‌ మీడియాలో కుప్పు తెప్పలుగా పుకార్లు వస్తున్నాయి.

తాజాగా సంపూర్నేష్‌బాబు మళ్లీ బిగ్‌బాస్‌ షోలో కనిపించాడు. ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులకు వీడ్కోలును పలికేందుకు ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా తీసుకు వచ్చాడు. ఇక తాజాగా హైదరాబాద్‌ చేరుకున్న సంపూర్నేష్‌బాబు తనపై వస్తున్న పుకార్లకు సోషల్‌ మీడియా ద్వారా చెక్‌ పెట్టే ప్రయత్నం చేశాడు. తనకు బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు అవకాశం దక్కడం గర్వంగా ఫీలవుతున్నాను అంటూ చెప్పుకొచ్చిన సంపూ కొన్ని కారణాల వల్ల వెళ్లాల్సి వచ్చిందని, వెళ్లిన తర్వాత బాధపడ్డాను అంటూ పేర్కొన్నాడు. ఇక నష్టపరిహారంను వసూళ్లు చేస్తున్నట్లుగా వచ్చిన వార్తలను సంపూ ట్విట్టర్‌ ద్వారా కొట్టి పారేశాడు. తన నుండి పెనాల్టీ వసూళ్లు చేస్తున్నారనేది కేవలం పుకార్లు మాత్రమే అని పేర్కొన్నాడు. తనకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌ నిజంగా హీరో అని, తన నిజమైన బిగ్‌బాస్‌ అంటూ సంపూ ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు:

షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ మంచును విష్ణు

రజనికి రూట్ క్లియర్ చేసిన కమల్ ?

జైలవకుశ స్టోరీ ఇదేనా ?