Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాపై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్లో ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుజీత్ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రాన్ని చేస్తున్నాడు. 150 కోట్ల బడ్జెట్తో ‘సాహో’ చిత్రాన్ని చేస్తున్నాడు. బాలీవుడ్ రేంజ్లో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ను హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది. భారీ పారితోషికంతో ఈ అమ్మడిని ఈ సినిమాలో నటింపజేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో శ్రద్దా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా ఆ వార్తలపై క్లారిటీ వచ్చింది. శ్రద్దా మొదటి షెడ్యూల్లో చాలా పాష్ అమ్మాయిగా కనిపించింది, ఉన్నత చదువులు చదువుకున్న అమ్మాయి పాత్రలో శ్రద్దా కనిపించబోతుందని భావించారు. కాని తాజాగా జరిగిన ఒక షెడ్యూల్లో పల్లెటూరు అమ్మాయిగా, డీ గ్లామర్గా కొన్ని సీన్స్ను చేసింది. ఆ కారణంగా ఆ సినిమా కోసం పనిచేసే కొందరు కింది స్థాయి కార్మికులు ఆమె సినిమాలో డబుల్ రోల్ అంటూ ప్రచారం చేశారు. కాని అసలు విషయం ఏంటి అంటే సినిమాలో శ్రద్ద ఒకే పాత్ర కాని, రెండు షేడ్స్ ఉండే పాత్రలో కనిపిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా చెబుతున్నారు. అంటే సినిమాలో కొంత సమయం పల్లెటూరు అమ్మాయిగా కనిపించి, ఆ తర్వాత అల్ట్రా మోడ్రన్ అమ్మాయిగా కనిపించనుందన్నమాట. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయం అంటూ ఇప్పటి నుండే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటున్నారు.