ఇక చెన్నైలోనే అంటున్న శ్రీరెడ్డి…!

Sride Reddy Is Still Chennai Byby To Hyderabad

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉంటున్న విషయం తెల్సిందే. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలుగు సినిమా పరిశ్రమపై అవాకులు చెవాలు పేళిన శ్రీరెడ్డి ఇక హైదరాబాద్‌కు రాను అంటూ తేల్చి చెప్పింది. తనను దారునంగా మోసం చేసిన టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసినట్లుగా ప్రకటించింది. తనను మోసం చేసిన వారిని మాత్రం వదిలేది లేదు అని, ఖచ్చితంగా వారిపై పగ తీర్చుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక తమిళనాడులోనే తన మకాం అని, ఇక్కడ నుండే సినిమా పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తాను అంటూ శ్రీరెడ్డి ప్రకటించింది.

sree-reddy

శ్రీరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఆమెకు ఎలాగూ ఛాన్స్‌లు రావు అని ఫిక్స్‌ అయ్యింది. అందుకే తమిళ పరిశ్రమలో ఛాన్స్‌లు దక్కించుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవలే తమిళ చిత్ర పరిశ్రమ నుండి ఛాన్స్‌లు కూడా దక్కించుకున్న ఈ అమ్మడు ఇక చెన్నైకే పరిమితం అవ్వాలనుకుంది. శ్రీరెడ్డి ప్రస్తుతం తన బయోపిక్‌ ‘రెడ్డి డైరీ’ని చేస్తుంది. తమిళంలో తెరకెక్కబోతున్న ఆ చిత్రంలో టాలీవుడ్‌కు సంబంధించిన పలువురి ప్రముఖుల బండారం బయట పడబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వర్క్‌ జరుగుతుందని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా పరిశ్రమలో ఉన్న కంపును తొలగించేందుకు కంకణం కట్టుకున్నట్లుగా చెబుతున్న శ్రీరెడ్డి తమిళ పరిశ్రమలో ఏ రేంజ్‌ కంపు రేపనుందో చూడాలి.

sree reddy