చెవులు వినిపించే చిట్టిబాబుతో సీక్వెల్‌..!

Sukumar says about Rangasthalam movie Sequel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘రంగస్థలం’ చిత్రంకు భారీ రెస్పాన్స్‌ దక్కింది. రికార్డు స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. రంగస్థలం చిత్రంలో చిట్టిబాబుగా రామ్‌ చరణ్‌ నటన అద్బుతం అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. కెరీర్‌లోనే బెస్ట్‌ యాక్టింగ్‌తో రామ్‌ చరణ్‌ ఆకట్టుకున్నాడు. చిట్టిబాబు పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. అందుకే ఆ పాత్రను అంత సులభంగా వదిలేయబోను అని, ఖచ్చితంగా సీక్వెల్‌ తీస్తాను అంటూ దర్శకుడు సుకుమార్‌ ప్రకటించాడు. అయితే సీక్వెల్‌కు కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.

చిత్ర సక్సెస్‌ సందర్బంగా దర్శకుడు సుకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ చిట్టిబాబు పాత్రను తాను ఊహించినదానికంటే ఎక్కువగా ప్రేక్షకులు ఆధరించారు అని, అందుకే మరోసారి చిట్టిబాబు పాత్రతో సినిమాను తీయాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. చిట్టిబాబు ఆపరేషన్‌ చేయించుకుని చెవు వినిపించే వ్యక్తిగా సీక్వెల్‌లో కనిపిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. చెవులు వినిపించని చిట్టిబాబుగా రామ్‌ చరణ్‌ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు చెవులు వినిపించే చిట్టిబాబుగా రామ్‌ చరణ్‌ను చూపిస్తే ప్రేక్షకులు ఆధరిస్తారా అనేది చూడాలి. సుకుమార్‌ ఎలా తీసినా, ఏం చేసినా కూడా ప్రేక్షకులు ఆధరిస్తూనే ఉంటారు. అందుకే రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో ‘రంగస్థలం’ చిత్ర సీక్వెల్‌ కూడా విజయం సాధించడం ఖాయం అని సినీ విశ్లేషకులు అప్పుడే అంచనా వేస్తున్నారు.