స్పందించక పోవడం మంచిదైంది

Suresh Babu doesn't Respond on Sri Reddy and Abhiram issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ తనను మోసం చేశాడని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాను అంటూ వాడుకున్నాడని, ప్రేమించాను అంటూ నమ్మించి నా జీవితంతో ఆడుకున్నాడు అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు, అందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ విషయమై కొందరు మద్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించగా మరి కొందరు ఈ విషయంపై స్పందించేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ మీడియా ముందుకు రావాలంటూ డిమాండ్‌ చేయడం జరిగింది. ఎవరు ఎంతగా డిమాండ్‌ చేసినా కూడా సురేష్‌బాబు ఫ్యామిలీ నుండి ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి అభిరామ్‌ విషయమై మాట్లాడలేదు.

అభిరామ్‌ విషయం మెల్ల మెల్లగా కనుమరుగవుతుంది. శ్రీరెడ్డి తీవ్ర స్థాయిలో పవన్‌పై వ్యాఖ్యలు చేసిన తర్వాత అభిరామ్‌ విషయంను పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు అంతా కూడా శ్రీరెడ్డి, పవన్‌, పవన్‌ ఫ్యాన్స్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకే సురేష్‌బాబు ఆ సమయంలో స్పందించక పోవడం మంచిదైందని, ఆమెతో సెటిల్‌మెంట్‌కు కోట్లు ఖర్చు కాకుండానే వివాదం సైలెంట్‌ అయ్యిందని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో స్పందించడం వల్లే ఇంకా ఎక్కువ పరువు పోతుందని, సైలెంట్‌గా ఉండటం వల్ల మంచి ఫలితం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.