మొదట సావిత్రి సమంతనే.. కాని!

Swapna Dutt says samantha akkineni was finalised for mahanati befor keerthy suresh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘మహానటి’. మార్చి 29న విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పర్చుకున్న సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన విషయం తెల్సిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్‌ కూతురు స్వప్నదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు ముగిసేందుకు సిద్దం అయ్యింది. మరి కొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయబోతున్నట్లుగా నిర్మాత స్వప్నదత్‌ చెప్పుకొచ్చింది. మహానటి చిత్రంకు సంబంధించిన పు విషయాలను ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది స్వప్నదత్‌. 

Samantha-Ruth-Prabhu

స్వప్నదత్‌ మాట్లాడుతూ.. ‘మహానటి’ చిత్రం అనుకోగానే సావిత్రి గారి పాత్రకు సమంతను అనుకున్నాం. ఆమెతో చర్చించడంతో పాటు, ఆమె డేట్స్‌ కూడా అడిగాం. అయితే కొన్నాళ్ల తర్వాత స్క్రిప్ట్‌ రెడీ అవుతున్న కొద్ది సావిత్రి పాత్రకు కొత్త అమ్మాయి అయితే బాగుంటుందేమ అని ఎక్కువ మంది సలహా ఇచ్చారు. దాంతో అప్పుడప్పుడే పరిచయం అవుతున్న కీర్తి సురేష్‌ను మహానటి పాత్రకు ఎంపిక చేయడం జరిగింది. అయితే ‘మహానటి’ పాత్రను కమిట్‌ అయిన తర్వాత ఆమె చాలా పాపులర్‌ అయ్యింది. అయినా పర్వాలేదు అనుకుని, మహానటిని కీర్తి సురేష్‌తో పూర్తి చేయడం జరిగింది. సావిత్రి గారి పాత్రకు కీర్తి సురేష్‌ చాలా బాగా సూట్‌ అయ్యారు. ఇక కీర్తి సురేష్‌ పాత్రతో పాటు సమంతకు కూడా ఈ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఆమె కూడా సినిమాకు తప్పకుండా హైలైట్‌ అవుతుందనే నమ్మకం ఉందని స్వప్నదత్‌ చెప్పుకొచ్చింది.