Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ పశుసంవర్థక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. శామిర్ పేట నుంచి కీసర వెళ్తుండగా… ఔటర్ రింగ్ రోడ్డుపై తలసాని వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుంచి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనతో పాటు వాహనంలో ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ఆయనను కీసరకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదంలో వాహనం బాగా దెబ్బతింది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మంత్రి కీసరలో కొత్త కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.