TG Politics: ఇవాళ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నేతలతో భేటీకానున్న కేసీఆర్

TG Politics: KCR to meet Mahbubnagar and Nagarkurnool leaders today
TG Politics: KCR to meet Mahbubnagar and Nagarkurnool leaders today

నేడు మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై నేతలకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ముఖ్యంగా నాగర్‌ కర్నూల్ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు కేసీఆర్.

కాగా, నాలుగు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసిఆర్ ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు BRS భవన్ లో జరిగిన భేటీ తర్వాత 4 స్థానాల్లో పోటీ చేసే వాళ్లను అధికారికంగా ప్రకటించారు.

పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బి.వినోద్ కుమార్, ఖమ్మం పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి BRS సిట్టింగ్ ఎంపీ అయిన మాలోతు కవితకు మళ్లీ అవకాశం ఇచ్చారు.