ఇద్దరూ పంథం నెగ్గించుకున్నారు

thaman replaces anirudh ntr movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం షూటింగ్‌ ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్నా కూడా, కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్‌ను ఎంపిక చేయాలని త్రివిక్రమ్‌ నిర్ణయించుకున్నాడు. అయితే అజ్ఞాతవాసి చిత్రానికి అనిరుథ్‌ అందించిన సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా అనిరుథ్‌ సంగీతంను ఇవ్వలేడు అనేది ఎన్టీఆర్‌ అభిప్రాయం. అందుకే దేవిశ్రీ ప్రసాద్‌ లేదా థమన్‌లలో ఒకరిని ఎంపిక చేయాలి అనేది ఎన్టీఆర్‌ డిమాండ్‌. ఆ విషయమై త్రివిక్రమ్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కాని త్రివిక్రమ్‌ మాత్రం అందుకు ససేమేర అన్నాడు.

అజ్ఞాతవాసి సమయంలోనే తన తర్వాత సినిమాకు కూడా అనిరుథ్‌ సంగీత దర్శకుడు అని తేల్చి చెప్పిన త్రివిక్రమ్‌ తాజాగా ఆయనతో వర్క్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఎన్టీఆర్‌ సినిమాకు సంగీతం అందించే బాధ్యతను ఆయనపై పెట్టాడు. అయితే అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్‌ అయినా కూడా ఎన్టీఆర్‌ సినిమాకు పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. ఆ కారణంగా అనిరుథ్‌ను త్రివిక్రమ్‌ పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

గత కొన్నాళ్లుగా దేవిశ్రీ ప్రసాద్‌తో కాస్త దూరంగా ఉంటున్న త్రివిక్రమ్‌ ఆయన కాకుండా ఎన్టీఆర్‌ చెప్పినట్లుగా థమన్‌ను లైన్‌లోకి తీసుకు వచ్చాడు. ఎన్టీఆర్‌ కోరినట్లుగా అనిరుథ్‌ కాకుండా థమన్‌ను ఎంపిక చేయడంతో పాటు, తాను అనుకున్నట్లుగా దేవిశ్రీ ప్రసాద్‌ కాకుండా మరో దర్శకుడితో త్రివిక్రమ్‌ చేస్తున్నాడు. దీంతో ఇద్దరు కూడా పంథం నెగ్గించుకున్నట్లయ్యిందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.