బెజవాడలో దారుణం… పట్టపగలే మహిళ గొంతుకోసి మరీ…

Thiefs Murder attempt on Women at Vijayawada

విజయవాడలో పట్టపగలు దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలు చోరీకి ప్రయత్నం చేశారు దొంగలు… అయితే మహిళ ప్రతిఘటించడంతో పీకకోసి మహిళను హత్య చేసి పరారయ్యారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో ఈ ఘటన జరిగింది. చోరీ కోసం దొంగలు రావడంతో పద్మావతి అనే మహిళ వారిని అడ్డుకుంది. కేకలు వేసింది దీంతో ఆమె పీక కోసి అక్కడి నుంచి దుంగలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడివున్న ఆమెను పోలీసులు ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పద్మావతి ఇంట్లో దొంగతనం, హత్యాప్రయత్నం తర్వాత దుండగులు మరో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు. అక్కడ పనిచేసే వాచ్‌మెన్‌ని దుస్తులు ఇవ్వమని బెదిరించారు. వెంటనే వాచ్‌మెన్‌ ఎవరూ ఏం దుస్తులని అడగడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. పట్టపగలే ఈ ఘటన జరగడంతో విజయవాడలో కలకలం రేగింది. ఇది పాతనేరస్తులా? లేక తెలిసినవారి పనా? అనే కోణంలో విచారణ చేపట్టారు.