టిక్ టాక్ మోజులో పురుగుల మందు తాగుతూ.. మరొకరు మృతి..!

టిక్ టాక్ లో ప్రేమ వ్యవహారం ...ఆ ఫై అత్యాచారం

టిక్ టాక్ పిచ్చి జనాల్లో ఇంకా రోజు రోజుకు ముదిరిపోతూనే ఉంది. లైక్ ల కోసం ఫాలోవర్స్ కోసం టిక్ టాక్ వీరులు ప్రాణాల సైతం లెక్కచేయడం లేదు. గతంలో టిక్ టాక్ రూపంలో సెల్ఫీలకోసం ఎంతో మంది ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఘటనలు మనం చూశాం. తాజాగా ఓ యువకుడు ఏకంగా ఇలా చనిపోతామంటూ ఓ వీడియో తీశాడు. దాంతో ఆ వీడియో అతని ప్రాణాలను విడిచేలా చేసింది.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలుకాలోని గౌరగానహళ్ళి గ్రామానికి చెందిన ధనంజయ. టిక్ టాక్ లో వీడియోలు తెగ పోస్ట్ చేస్తుంటాడు. అవి బాగా వైరల్ అవుతుంటాయి. దీంతో టిక్ టాక్ విపరీతంగా మోజు పెంచుకున్నాడు. అయితే తాజాగా ఆదివారం నాడు పురుగుల మందు తాగి చనిపోయేటప్పుడు అనుభవాలు ఎలా ఉంటాయో వీడియో ద్వారా షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత కుప్పకూలిన అతన్ని తల్లి తండ్రులు చూసి ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ ధనుంజయ్ చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. కాగా ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.