చంద్రబాబుకు గుడి కట్టేస్తున్నారు !

Transgenders to build a temple for Chandrababu Naidu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారమే అన్ని హామీలు నెరవేర్చారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా తమతో మాట్లాడటమే అసహ్యించుకునే ఈ రోజుల్లో తమ మొర ఆలకించి తమ విన్నపాలన్నీ మన్నించిన సిఎంకు కృతజ్ఞతగా గుడి కట్టిస్తున్నారు వారు. పూర్తి వివరాలలోకి వెళితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హిజ్రాలు ఏకంగా గుడిని కట్టిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి ఈరోజు మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు శంకుస్థాపన చేశారు. హిజ్రాలకు రూ. 1500 పెన్సన్ తో పాటు తెల్ల రేషన్ కార్డును కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబుపై కృతజ్ఞతలో హిజ్రాలు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ నిర్మాణానికి ఎంపీ టీజీ వెంకటేష్, మంత్రి అఖిలప్రియ, స్థానిక నేత అభిరుచి మధులు సహకరిస్తున్నారు. 10 కేజీల వెండితో చంద్రబాబు విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు.