కాంగ్రెస్‌ టికెట్ల ప్రకటనపై ట్విస్ట్‌..

Election Updates: Nobody should pay electricity bills- Revanth Reddy
Election Updates: Nobody should pay electricity bills- Revanth Reddy

కాంగ్రెస్‌ టికెట్ల ప్రకటనపై ట్విస్ట్‌ చోటు చేసుకుంది. కాంగ్రెస్ “వార్ రూమ్” లో తెలంగాణ “స్క్రీనింగ్ కమిటీ” సమావేశమైంది. ఈ రోజు పూర్తి జాబితాను ఖరారు చేసి కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ” ఆమోదం కోసం సిఫార్సు చేయనుంది “స్క్రీనింగ్ కమిటీ”. నిన్నటి సమావేశంలో సుమారు 60 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్దులపై ఏకాభిప్రాయం వచ్చిందని సమాచారం.

మరో 30 అసెంబ్లీ స్ఖానాల్లో ఇద్దరి అభ్యర్ధుల పేర్లు జాబితా ఖరారు అయిందట. మరో 30 అసెంబ్లీ స్థానాల్లో ముగ్గురు అభ్యర్థుల పేర్లు ఖరారు అయిందని సమాచారం. ఈ రోజు మరింత వడపోత ప్రక్రియతో, అభ్యర్ధుల జాబితాను కుదించనుంది తెలంగాణ “స్క్రీనింగ్ కమిటీ”. వచ్చే వారం సమావేశం కానుంది కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ”. అంతిమ జాబితాను ఒకేసారి అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇక అటు బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే 115 సీట్లు ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతోంది.