బాబోయ్‌.. కోటి కాదు రెండు కోట్లట!

Two Crores Offer to Pooja Hegde for Bellamkonda Srinivas Film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Two Crores Offer to Pooja Hegde for Bellamkonda Srinivas Film

‘ముకుంద’, ‘ఒక లైలాకోసం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి ఆవెంటనే బాలీవుడ్‌ వెళ్లిపోయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే మళ్లీ ‘డీజే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘డీజే’ చిత్రంలో నటించేందుకు కోటి రూపాయల పారితోషికాన్ని ఈ అమ్మడు డిమాండ్‌ చేసిందట. బాలీవుడ్‌లో కోటికి పైగా పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్న సమయంలో తాను కోటికంటే తక్కువకు తెలుగులో సినిమా చేసేది లేదని తేల్చి చెప్పిందట. దాంతో నిర్మాత దిల్‌రాజు మరియు అల్లు అరవింద్‌లు ఆమెను 75 లక్షలకు ఒప్పించినట్లుగా తెలుస్తోంది. డీజే సక్సెస్‌ అయిన నేపథ్యంలో పూజా హెగ్డే డిమాండ్‌ మరింత పెరిగింది.

‘డీజే’ విడుదలకు ముందే బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. ఆ సినిమాకు పూజా 1.25 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు నిజం కాదని, బెల్లంకొండ శ్రీనివాస్‌తో రొమాన్స్‌ చేసేందుకు పూజా ఏకంగా రెండు కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. బికినీతో పాటు లిప్‌ లాక్‌కు కూడా సిద్దం అవ్వడం వల్ల రెండు కోట్ల పారితోషికాన్ని నిర్మాతలు ఆమెకు ఇవ్వనున్నారు. తెలుగులో ఇంత భారీ పారితోషికం తీసుకుంటున్న అతి తక్కువ హీరోయిన్స్‌లలో పూజా హెగ్డే ఒక్కరుగా నిలిచింది.

మరిన్ని వార్తలు:

రంగస్థలం టైటిల్‌ ఎందుకు పెట్టారో తెలుసా?

కమెడియన్‌కు ఖరీదైన శిక్ష