‘ఉప్పెన’ సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న మెగా హీరో **Vaishnav Tej****, ఆ తర్వాత ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలతో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. గత మూడేళ్లలో దాదాపు 100కు పైగా స్క్రిప్ట్లను తిరస్కరించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
పెద్ద నిర్మాతలు సంప్రదించినా సరైన కథ దొరకకపోతే నో చెప్పిన వైష్ణవ్ తేజ్, ఎట్టకేలకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘హంట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు Mahesh S దర్శకత్వం వహించనున్నాడు. మహేష్ వినిపించిన కథ వైష్ణవ్కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ AK Entertainments బ్యానర్పై, నిర్మాత Anil Sunkara భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా, ఆ తర్వాత షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్లో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మళ్లీ గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.
