కూతుర్ని అమ్మేసి… పెళ్ళాన్ని బేరం పెట్టాడు… ఇంతలో !

విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతనికి ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మేశాడు సత్య హరిశ్చంద్రుడు. ఇప్పడు జల్సాల కోసం ఓ ప్రబుద్ధుడు భార్య, పిల్లల్ని అమ్మకానికి పెట్టాడు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా వెంకటమ్మ, పసుపులేటి మద్దిలేటి దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. ఆటో నడిపే మద్దిలేటి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జల్సాల కోసం అప్పులు చేస్తూ భార్యాపిల్లల్ని వేధిస్తున్నాడు. మద్దిలేటి మద్యానికి బానిసై ఊర్లో రూ.15 లక్షలు అప్పుచేశాడు. ఇక ఈ అప్పు తీర్చేందుకు 13ఏళ్లున్న తన రెండో కుమార్తెను రూ.1.5 లక్షలకు వేరే వ్యక్తికి అమ్మేశాడు. బాండ్ కూడా రాసి ఇచ్చాడు. దీంతో ఖంగుతిన్న వెంకటమ్మభర్త నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలతో సహా నంద్యాలకు వచ్చి తలదాచుకుంటోంది.

రెండో కూతుర్ని అమ్మేసిన మద్దిలేటి మిగతా సంతానం, భార్యపై దృఫ్టి పడింది. మూడు, నాలుగో కూతురుతో పాటు భార్యను 11 లక్షల రూపాయలకు అమ్మేందుకు తన సొంత అన్నయ్యతో బేరం కుదుర్చుకున్నాడు. బాండ్ పేపర్ పై సంతకం చేసేందుకు నిరాకరించిన వెంకటమ్మను మద్దిలేటి చితకబాదాడు. భర్త అమానుషాన్ని భార్య వెంకటమ్మ తెలివిగా బయటపెట్టింది. భర్త చేస్తున్న మైనర్ కూతురి వివాహాన్ని ఆపాలంటూ ఆమె ఐసీడీఎస్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. కానీ అధికారులు సీన్‌లోకి ఎంట్రీ అయ్యే సరికి అసలు విషయం గుట్టు రట్టయ్యింది. ఐసీడీఎస్ అధికారుల రాకతో మద్దిలేటి పారిపోయాడు. దీంతో వెంకటమ్మ ఐసీడీఎస్ సీడీపీఓ ఆగ్నేష్ ఏంజెల్, పిల్లల సంరక్షణ అధికారి శారదకు విషయం తెలిపింది. బాధితురాలినుంచి రాత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న ఐసీడీఎస్ అధికారులు పిల్లలను ఆళ్లగడ్డలోని బాలికల పాఠశాలలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నంద్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నా పెళ్లి గురించి నీకెందుకు ?- నిహారిక

happy-wedding-promotional-video-by-niharika

బ్రేకింగ్ న్యూస్… నాగశౌర్యతో నిహారిక పెళ్లి ఫిక్స్… ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్..?? బాహుబలి ప్రభాస్ – కొణిదెల నిహారిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు… త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు… రెండు కుటుంబాలు ఇప్పటికే మాట్లాడుతున్నాయి. చిరంజీవి పెద్ద తరహాగా… ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో మాట్లాడారు… నాగబాబు ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది… ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. అయితే ఇదే విషయాన్నీ మెగా డాటర్ నిహారిక కొణిదెలను ఆమె వెడ్డింగ్ గురించి అడగ్గా మండిపడింది.

‘మేడం మేము యూ ట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం. ఈ మధ్య సోషల్ మీడియాలో మీ వెడ్డింగ్ గురించి బాగా వైరల్ అవుతోంది మేడమ్. దాని గురించి ఏమైనా చెప్తారా?’ అని అడగ్గా నిహారిక ‘అసలు ఎవరయ్యా వీళ్లను లోపలికి రానిచ్చింది? నా పెళ్లి గురించి మీకెందుకయ్యా? నిహారిక ఎవరిని చేసుకుంటుంది? ఎప్పుడు చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటుంది? చూస్తే షాక్ అవుతారు… షేక్ అవుతారు… కిందపడి లేస్తారు. పిచ్చామీకేమైనా? మీ థంబ్‌నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా?’’ అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది.

ఇంతలోనే ఆ వ్యక్తి ‘మేడమ్ మేము అడిగేది మీ హ్యాపీ వెడ్డింగ్ మూవీ గురించి’ అనగానే.. నీహారిక ‘‘సారీ సారీ సారీ… హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్ ఈ జూన్ 30న రిలీజ్ అవుతుంది. అప్పుడు మేము సినిమా రిలీజ్ ఎప్పుడో చెబుతాం ఓకే’’ అంటూ బై చెప్పేసి కారెక్కి వెళ్లిపోయింది. ఇదంతా నిజం కాదు హ్యాపీ వెడ్డింగ్ మూవీ కోసం డిఫరెంట్‌గా క్రియేట్ చేసిన ప్రమోషనల్ వీడియో. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నీహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించారు. యూత్ లో నిహారికకు విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఎందుకంటే వారికి ఆమె పలు వెబ్ సిరీస్ ల ద్వారా దగ్గరైంది మరి వాళ్లంతా కూడా ఆమె నుంచి రానున్న సినిమా కోసం ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను కొత్త కాన్సెప్ట్ తో రిలీజ్ చేశారు.

దేవుడు సాక్షిగా బాబు, పవన్ ఎదురుపడ్డారు… అయితే?

టీడీపీ, జనసేన మధ్య మున్ముందు కూడా ఘర్షణ వాతావరణం ఉంటుందా లేక ఏమైనా సయోధ్య కుదురుతుందా ? ఈ ప్రశ్నకు ఈ రోజు ఓ ఘటన సమాధానం చెప్పింది. 2014 ఎన్నికల ముందు నుంచి టీడీపీ గురించి, చంద్రబాబు గురించి సానుకూలంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభ తర్వాత రూట్ మార్చారు. టీడీపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇంతకుముందు నెయ్యం, ఇప్పుడు కయ్యం లో వున్న ఆ ఇద్దరు ఒక్క చోట చేరితే, ఒకరికి ఒకరు ఎదురు పడితే ఎలా ఉంటుందో అని చాలా మందికి ఆసక్తి వుంది. దీనికి కారణం అంతకు ముందు ఆ ఇద్దరూ ఒకరి మీద ఒకరు చూపించుకున్న గౌరవమర్యాదలు. వయసులో పెద్దవాడిగా, సీఎం గా వున్న చంద్రబాబుని పవన్ గౌరవంగా చూడడం ఒక ఎత్తు అయితే పవన్ సచివాలయానికి వస్తే దగ్గరుండి తీసుకెళ్లి, మళ్లీ వీడ్కోలు పలికే స్థాయిలో బాబు ఆయనకు గౌరవం ఇచ్చారు. అలాంటి ఆ ఇద్దరూ ఈరోజు దేవుడు సమక్షంలో ఎదురు పడ్డారు. అక్కడ ఏమైందంటే…

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా లింగమనేని సంస్థ నిర్మించిన దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు. లింగమనేని పిలుపు మేరకు వచ్చిన ఆ ఇద్దరూ ఒకే సారి పూజల్లో పాల్గొనాల్సి వచ్చింది. గర్భ గుడి ముందు ఆ ఇద్దరూ ఎక్కువసేపు ఒకే చోట ఉండాల్సి వచ్చింది. ఓ సందర్భంలో మరీ పక్కపక్కనే నించో వలసి వచ్చింది. అయినా ఆ ఇద్దరూ పక్కన వున్న వ్యక్తి పరిచయం ఉన్నట్టు కూడా వ్యవహరించలేదు. చివరికి ఒకరికి ఒకరు మర్యాదపూర్వక అభివాదం కూడా చేసుకున్నట్టు కనిపించలేదు. దీంతో ఆ ఇద్దరూ ఎదురు పడితే ఏమవుతుందో అని ఆసక్తిగా చూసిన వారికి టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ ఏ స్థాయిలో వుంది అన్నది అర్ధం అయ్యింది.

వెంకటేశ్వర స్వామి పూజ కార్యక్రమాల కోసం సీఎం చంద్రబాబు వున్న వేదిక దగ్గరకు పవన్ కళ్యాణ్ రావడం కూడా ఆశ్చర్యం కలిగించింది. సహజంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తేనే తండ్రిగా చెప్పుకునే అన్న చిరంజీవికి ఎదురు పడేందుకు కూడా ఒప్పుకొని పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రావడం విశేషమే. ఇక టీటీడీ గురించి నిన్నే సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆరోపణల మీద విచారణ జరిపించాలని కోరుకున్న పవన్, అదే ట్వీట్ లో ఈ ఆరోపణల నుంచి టీడీపీ బయటపడుతుందన్న అభిలాష వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కోసం ఆ ఇద్దరూ కలవడం చూస్తుంటే ఉప్పునిప్పులా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉందాం అనుకున్నా ప్రకృతి, రాజకీయ పరిస్థితులు భిన్నమైన పరిస్థితికి దారులు వేస్తున్నట్టు అనిపించడం లేదూ!.