గోపీచంద్ పంతం మూవీ టీజర్

Pantham Movie Teaser

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

గోపీచంద్‌, మెహరీన్‌ లీడ్ రోల్స్ గా తెరకెక్కుతున్న చిత్రం పంతం. దీనికి ఫర్‌ ఎ కాస్‌ అన్నది క్యాప్షన్. బలుపు, పవర్‌, జై లవకుశ వంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ జులై 5వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకురానుంది..చివరి షెడ్యూల్ షూటింగ్ స్కాట్లాండ్, లండ‌న్ లో కొనసాగుతున్నది. కాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. మీరు చూసెయ్యండి మరి

స్టార్స్ మామూలు మనుషులు కాదు… ‘సమ్మోహనం’ ట్రైలర్ అదుర్స్

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సుధీర్ బాబు .. అదితీ రావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కుతున్న చిత్రం సమ్మోహనం . జూన్ 15న విడుద‌ల కానున్న ఈ చిత్రం సినిమా వరల్డ్ సంబంధించిన నేప‌థ్యంలో సాగ‌నుంద‌ని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. కృష్ణ పుట్టిన రోజు కావ‌డంతో కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా వాళ్ల మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పనుకున్నాను .. నిన్ను కలిసిన తరువాత. కాదని చెంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశావ్ అంటూ సుధీర్ బాబు ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ సినిమా మీద ఆసక్తి కలిగిస్తోంది.

పతివ్రత అన్న సర్టిఫికెట్ తో వచ్చిందా? : హరితేజ ఇష్యూ మీద తమ్మారెడ్డి ఫైర్

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఓ సినిమా థియేటరులో తనకు ఎదురైన అనుభవాన్ని కన్నీరు పెట్టుకుంటూ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితీ ఈ విషయం మీద మేమంతా ఒక్కటే అని చెప్పుకునే సినీ పెద్దలు ఎవరూ స్పందించక పోగా ఇప్పుడు సినిమా పెద్దల్లో ముఖ్యులైన తమ్మారెడ్డి భరధ్వాజ తీవ్ర స్థాయిలో స్పందించారు. హరితేజ వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం, ఇటీవల ‘మహానటి’ సినిమా చూసేందుకు తన తండ్రి, తల్లి, చెల్లెలుతో హరితేజ థియేటర్ కు వెళ్లింది. ఇంటర్వెల్ తరువాత, వారు సీట్లు మారారు. దీంతో వీరి పక్కన కూర్చున్న తల్లీ కూతుళ్లు హరితేజ కుటుంటంతో వాగ్వాదానికి దిగారు. తన కుమార్తె పక్కన హరితేజ తండ్రి కూర్చోరాదని వాదించిన సదరు తల్లి, మీ నాన్న పక్కన కూర్చోడానికి తన కుమార్తె ఇబ్బంది పడుతోందని, మగాళ్ల పక్కన కూర్చోడానికి తామేమీ సినిమా వాళ్లం కాదని చెప్పింది.

ఈ మాటలతో బాధ పడ్డ హరితేజ, తాను ఎదుర్కొన్న ఘటనపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇక దీన్ని చూసిన నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ తీవ్రంగా స్పందించారు. సదరు ప్రేక్షకురాలేమైనా పతివ్రత అన్న సర్టిఫికెట్ తో థియేటర్ కు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీని చాలా చులకనగా చూడడం ఎక్కువైపోతోందని కొందరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కడుపు రగిలిపోతోంది, రెండు పీకాలని కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరిలాగే హరితేజ ఫ్యామిలీ టికెట్టు కొనుక్కుని సినిమాకు వెళితే అవమానించడం ఏంటని మండిపడ్డారు. సినిమా వాళ్ళ లాగా మగోళ్ల పక్కన మా పిల్లలు కూర్చోరు అని మాట్లాడడం ఎంత దారుణం బస్సులో, రైల్లో, విమానాల్లో ప్రయాణించే సమయంలో మీరు మంచి వారేనా అని అడిగి కూర్చుంటారా. ఆ సంధర్భంలో మీ పక్కన కూర్చున్న వారంతా మంచి వారే అని గ్యారెంటీ ఇవ్వగలరా.

అసలు ముందు మీరెలాంటి వారు అని మేము అడిగామా అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. హరితేజ సినిమా సెలెబ్రిటీ కాబట్టి గుర్తు పట్టి మరి ఆ మాట అన్నారు. సినిమా వాళ్లంతా చెడ్డవాళ్ళు అనే ముద్ర, సర్టిఫికెట్ ఇచ్చేశారు సరే మీరు మంచి వారా కాదా అనే సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు. ఈ సారి థియేటర్ కు వచ్చేముందు సర్టిఫికెట్ తీసుకుని వచ్చి మా పక్కన కూర్చోండని తమ్మారెడ్డి అన్నారు. సినిమా వాళ్ళు కూడా అందరి లాంటి మనుషులే సమాజంలో చెడ్డవారు ఉన్నట్లే సినిమా ఇండస్ట్రీలో కూడా కొంత మంది చెడ్డవారు ఉండే అవకాశం ఉందని అన్నారు. అంత మాత్రానికే అవమానంగా మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు. తన మాటలు బాధపెడితే క్షమించాలని అంటూనే, సినిమావాళ్లను చిన్న చూపుచూడవద్దని, వారూ మామూలు మనుషులేనని, తాము ప్రేక్షకులను దేవుళ్లుగా చూస్తామని చెప్పుకొచ్చారు.

చిన్నారి అభిమాని కోసం కదిలివచ్చిన జనసేనాని

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల్లో ఉండటమే సరైన మార్గం అని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఓ చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చారు. వివరాల్లోకి వెళితే 6 ఏళ్ల వయసున్న చిన్నారి రేవతి గత కోనేళ్ళుగా మస్క్యూలర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో భాధపడుతోంది. ఎప్పటికైనా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలవాలనేది ఆ చిన్నారి కోరిక. ఈ విషయాన్ని అనుచరుల ద్వారా తెలుసుకున్న పవన్ వెంటనే పాప ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. పాపకు బ్యాటరీతో నడిచే వీల్ చైర్ అవసరమని డాక్టర్లు సూచించడంతో ఆ వీల్ చైర్ ను ఏర్పాటు చేస్తానని, అలాగే వైద్యానికి అవసరమయ్యే ఆర్ధిక సహాయాన్ని కూడ అందిస్తానని హామీ ఇచ్చారు.

ఇలా పవన్ స్వయంగా వచ్చి కలవడం, సహాయం అందిస్తానని మాటివ్వవడంతో రేవతి, ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేసి పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆరేళ్ళ ఆ చిన్నారికి కాళ్ళు, చేతులు పట్టు ఇవ్వకపోవడంతో ఇబ్బందిపడింది. కొద్దిసేపు పాపను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని సరదాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఒళ్లో కూర్చున్న చిన్నారి రేవతి ఎన్నో ముచ్చట్లు చెప్పింది. గబ్బర్ సింగ్ సినిమా అంటే తకు ఇష్టమని చెప్పింది. ఆ సినిమాలో పాటలు పాడి, డైలాగ్స్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఎంతో ముచ్చట పడ్డారు. రేవతి పాడిన అన్నమయ్య కీర్తనలు విని ‘ఈ కీర్తనలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా’ అని అడిగితే ‘మా సంగీతం మిస్ నేర్పుతున్నారు’ అని చెప్పింది.

రేవతిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ పాప ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రుల అడిగి పవన్ తెలుసుకున్నారు. రేవతిని బెంగళూరులోని నిమ్ హన్స్ ఆసుపత్రిలో చూపించామని, పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు వైద్యం ఉందనీ, ఖర్చు చాలా అవుతుందని వైద్యులు చెప్పారని పవన్ కు రేవతి తల్లిదండ్రులు చెప్పారు. ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయించాల్సి వస్తోందని, ఒకవేళ చేయించకపోతే కండరాలు బిగుసుకుపోయి చాలా బాధపడుతోందని ఆమె తల్లి చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ కళ్లు చెమర్చాయి.