బిగ్‌బాస్‌ నాని లుక్‌… కాస్త అసంతృప్తి

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Nani Look in Bigg Boss Telugu Season 2 show

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఆరంభంకు రంగం సిద్దం అయ్యింది. గత నెల రోజులుగా రెండవ సీజన్‌ గురించి మీడియాలో వార్తలు జోరుగా వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి మొదలైంది. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండవ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లుగా స్టార్‌ మా రెండు నెల క్రితమే హింట్‌ ఇచ్చింది. అయితే ఎన్టీఆర్‌ స్థానంలో నానిని చూడటం కష్టమే అంటూ మొదటి నుండి కొందరు ప్రేక్షకులు అంటూ వస్తున్నారు. తాజాగా అదే రుజువు అయ్యింది. ఇటీవలే బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కు సంబంధించిన నాని లుక్‌ను అధికారికంగా రివీల్‌ చేయడం జరిగింది.

బిగ్‌బాస్‌ సీజన్‌ 1 లుక్‌ను ఎలా అయితే రివీల్‌ చేసి ఎన్టీఆర్‌ అందరిని ఆకట్టుకునేలా చేశారో, సీజన్‌ 2 కోసం కూడా నానితో ప్రత్యేకంగా ఫొటో షూట్‌ను జరిపి కొన్ని స్టిల్స్‌ను విడుదలకు సిద్దం చేశారు. ఎన్టీఆర్‌ను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు బిగ్‌బాస్‌ లోగో పక్కన నానిని చూసి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటిది స్టార్‌ మా వారు ముందే గ్రహించారు. అయితే నాని రెండు మూడు వారాలు షోకు హోస్టింగ్‌ చేసిన తర్వాత అప్పుడు కాని ప్రేక్షకులు ఆయన్ను అంగీకరించరు అంటూ స్వయంగా స్టార్‌ మా అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా నాని తెలుగు ప్రేక్షకులను బిగ్‌బాస్‌తో అరిస్తాడనే నమ్మకంను స్టార్‌ మావారు వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు 16 లక్షల మంది ఆకలి తీరుస్తున్న అక్షయ పాత్ర

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తిండి లేక చిన్నారులు విద్యకు దూరం కాకూడదన్న ఉన్నతమైన ఆశయాలతో, విద్యా బుద్ధులు నేర్వటానికి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న నిరుపేద విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది అక్షయపాత్ర సంస్థ. 2000 సంవత్సరంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ(ఇస్కాన్ బెంగుళూరు) ఆధ్వర్యంలో భారతదేశంలో కేవలం 5 ప్రభుత్వ పాఠశాలలోని 1,500 మంది విద్యార్థుల కోసం ప్రారంభం అయిన అక్షయపాత్ర ఈ రోజు ఇంతింతై వటుడింతై అన్న తీరున దేశంలోని 12 రాష్ర్టాల్లో 14,000 పాఠశాలలో చదువుతున్న 16 లక్షల మంది విద్యార్థులకు అధునాతమైన వంటశాలల ద్వారా రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజన రూపంలో అందిస్తూ ఉన్నత స్థానానికి చేరుకుంది. ఈ రోజుల్లో 5 రూపాయలకు ఏం వస్తుంది. అందులో రాజధాని హైదరాబాద్ నగరంలో సింగిల్ టీ కూడా రాదు. అటువంటింది కేవలం 5 రూపాయలకు భోజనాన్ని అందిస్తు దాదాపు 30వేల మందికి ఆకలిని అతి తక్కువ ధరలో తీరుస్తోంది కూడా ఇదే సంస్థ.

హరేక్రిష్ట ఉద్యమం ప్రారంభించిన అక్షయపాత్ర ద్వారానే ఈ కార్యక్రమం క్రింద ఐదు రూపాయలకు భోజనాన్ని పేద వారికి అందిస్తున్నారు నిర్వహకులు. హరేక్రిష్ణ ఉద్యమానికి వెన్నుదన్నుగ నిలచే దాతలనుంచి విరాళాలను అక్షయపాత్ర పేరుతో స్వీకరిస్తుంది.దీనికి వచ్చే విరాళాలను చిన్నారుల చదువులకు, వారి భోజనానికి ఖర్చు చేస్తారు. అక్షయపాత్రకు అందించే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపుకూడా లభిస్తుంది. ఏది ఏమైనా వంట సరుకు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే అన్ని వండి వార్చి రుచికరమైన భోజనంగా మలచి శ్రమను సైతం లెక్క చేయకుండా ఎందరి ఆకలినో తీరుస్తున్న ఈ పధకాలు నిజం పేదలపాలిట పెన్నిధిలాంటివి. మానన సేవే మాధవ సేవగా సాగుతున్న అక్షయ పాత్ర సేవలు మరిన్ని కాలాల పాటు కొనసాగాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

అమెరికాలో బీజేపీ ఎంపీని బెంబేలెత్తించిన ప్రత్యేక హోదా నిరసన సెగ

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీకి అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకి సంబందించిన బీజేపీ నేతలు వెళ్ళిన ప్రతిచోటా వారికి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. చివరికి అమెరికా వెళ్లినా బీజేపీ నాయకులకు ప్రతిఘటనలు ఎదురు కావడం ఇప్పుడు తెలుగు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. తెలుగు వ్యక్తే అయినా ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా అధిష్టానం ఆశీసులతో రాజ్యసభ ఎంపీ అయిన జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. మోడీ చేసిన వంచనను మసి పూసి మారేడు కాయ చేసి టీడీపీ మీదకు నెపం తోసివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ కూడా ఆయనకు ప్రతిఘటన తప్పడం లేదు. తాజాగా న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ లో బీజేపీ ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతాపార్టీ ఆఫ్ బీజేపీ యూఎస్ఎ’ పేరిట అమెరికాలో ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ను ఆహ్వానించారు.

ఆయన ఎప్పటిలాగానే… ప్రత్యేకహోదా వంచన విషయంలో పాత పాట పాడడం ప్రారంభించారు. హోదా ను మించిన ప్యాకేజి ఇస్తున్నామని, చంద్రబాబు తీసుకోవడం లేదని, నానా అవాకులు చెవాకులు పేలడం ప్రారంభించారు. ఈ వరుస అబద్దాలను సహించలేకపోయిన సభికులైన ప్రవాసాంధ్రులు లేచి నిల్చోని, మీరు అన్నీ అబద్దాలు చెబుతున్నారంటూ నిలదీశారు. సభలో గందరగోళం చెలరేగింది. బీజేపీ నేతల తీరుకు నిరసనగా సభలో పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. దీంతో బీజేపీ నేతలకు చెమటలు పట్టినంతపనైంది. సభలోని ఆంధ్రప్రదేశ్ తరపున గళం విప్పుతున్న ఎన్నార్యేలను అమెరికా పోలీసులతో నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సభ రసాభాసగా మారింది. అయితే ఈ నిరసనలు కూడా వ్యూహాత్మకంగా చేసారని జీవీఎల్ ఆరోపిస్తున్నారు. కావాలనే ప్లాన్ చేసి చేస్తున్నవే అని, మీరు అందరూ దుష్ప్రచారపు మాయలో పడుతున్నారని” నరసింహారావు కాసేపు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు వినే పరిస్థితి లేకపోవడంతో నరసింహారావు ప్రసంగాన్ని అడ్డుకున్న వారిని బలవంతంగా సభనుంచి బయటకు పంపించారు. అయినా నినాదాల తాకిడి తట్టుకోలేకపోయిన నరసింహారావు తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించేశారని తెలుస్తోంది.

జగన్ పాదయాత్రలో చింతమనేని కాన్వాయ్… వైసీపీ శ్రేణులకి చాక్లెట్ల పంపిణీ

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసీపీ కార్యకర్తలకు చాక్లెట్లను పంచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర ఏలూరు రూరల్ మండలంలోని లింగాలగూడెంకు చేరుకొంది. అయితే అదే సమయంలో అదే గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా జగన్ పాదయాత్ర అడ్డుగా వచ్చింది. దీంతో జగన్ పాదయాత్ర కారణంగా చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో పాదయాత్ర డ్యూటీ లో అలెర్ట్ అయిన పోలీసులు ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు మోహరించి, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

అయితే ఎప్పుడు జగన్ మీద విరుచుకు పడే చింతమనేని ఈసారి మాత్రం వైసీపీ కార్యకర్తలతో ఎంతో సౌమ్యంగా మాట్లాడారు. ఎవరి కార్యక్రమాలు వారివేనని చింతమనేని వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చింతమనేని కారులో ఉండగా ఆయనతో కొందరు వైసీపీ కార్యకర్తలు మాట్లాడారు. జగన్ పాదయాత్రను చూసేందుకు వచ్చిన వైసీపీ శ్రేణులకు చింతమనేని ప్రభాకర్ చాక్లెట్లు పంచి ఇచ్చారు. మరో వైపు పోలీసులు భారీ బందోబస్తు మధ్య చింతమనేని ప్రభాకర్ కాన్వాయ్ ను అక్కడి నుండి పంపించివేశారు. ఎటువంటి ఘర్షణలు లేకుండా చింతమనేని అక్కడి నుండి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకోవడం పోలీసుల వంతయింది.

భరత్ అనే నేను ” బడ్జెట్ పై అసెంబ్లీ ” అన్ కట్ సీన్ చూసారా …

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భరత్‌ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్‌ అయిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ షో లతో రన్‌ అవుతోంది. భరత్ అనే నేను మూవీ కలెక్షన్ల పరంగా మహేశ్ బాబు కెరీర్లో అతిపెద్ద హిట్‌గా నిలిచింది.  తాజాగా సూపర్‌ స్టార్ అభిమానుల కోసం చిత్రయూనిట్ ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఎలాంటి ఎనౌన్స్‌మెంట్‌ లేకుండానే సినిమాలో లేని నాలుగు వీడియో క్లిప్‌లను రిలీజ్‌ చేశారు.
నిడివి కారణంగా సినిమాలో తొలగించిన సన్నివేశాలను యూట్యూబ్‌ లో రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. అసెంబ్లీలో బడ్జెట్‌కు సంబంధించిన డిస‍్కషన్‌తో పాటు మరో మూడు సన్నివేశాలను చిత్రయూనిట్‌ రిలీజ్ చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి కాని ఈ సన్నివేశాలు ఈ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ సీన్ కాస్త సాగదీసినట్టు ఉన్నప్పటికీ.. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకు ఆలస్యమైందో మహేశ్ ఇచ్చే వివరణ మాత్రం ఆకట్టుకుంటుంది. 

నాగార్జున ” ఆఫీసర్ ” టీజర్ – 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తేజ్ ఐ లవ్ యూ టీజర్…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Tej I Love You Teaser

సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ హీరోగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ లో ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తోన్న చిత్రం తేజ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో తేజు అనే పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నారు. నందిత అనే పాత్ర‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్నారు. విడుదల అయిన కొద్ది క్షణాల్లోనే దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ టీజర్ మీద మీరూ ఓ లుక్కేసేయ్యండి మరి…

క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే…అదరకొట్టిన నా పేరు సూర్య ట్రైలర్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రైట‌ర్ నుండి డైరెక్ట‌ర్ అయిన వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం నా పేరు సూర్య . మే 4న విడుద‌ల కానున్న ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో రూపొందింది. తాడేపల్లిగూడెం సమీపంలోని మిలటరీ మాధవరం లో ఆడియో వేడుక జ‌రుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న గచ్చిబౌలిలో ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌పుకోనుంది. ఈ కార్య‌క్రమానికి రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిధిగా హాజ‌రుకానున్నాడు. అయితే చిత్ర రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీపై ఆస‌క్తి క‌లిగిస్తున్నారు మేక‌ర్స్ .

కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో బ‌న్నీ చెప్పే డైలాగ్స్‌తో పాటు ఆయ‌న ప‌ర్‌ఫార్మెన్స్ అభిమానుల‌లో మరింత అంచనాలు పెంచేస్తోంది. మిలిట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బ‌న్నీ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. నా పేరు సూర్య చిత్రం తెలుగులోనే కాక ప‌లు భాష‌ల‌లోను విడుద‌ల కానుంది. నాకు కోపం వచ్చినపుడు బూతులే వస్తాయి.. మంత్రాలు రావు.. క్యారెక్టర్ వదిలేయడమంటే ప్రాణాలు వదిలేయడమే వంటి కొన్ని డైలాగ్స్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. అందరిని అలరిస్తోన్న ట్రైలర్ మీ కోసం