‘మోహిని’తో త్రిష మళ్లీ ఫాంలోకి..!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు మరియు తమిళంలో దాదాపు పుష్కర కాలం పాటు స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన ముద్దుగుమ్మ త్రిష. ఈ అమ్మడు తెలుగులో మరియు తమిళంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఏ హీరోయిన్కు అయినా కూడా కొంత కాలం తర్వాత ఫాం కోల్పోవడం తప్పదు. అలాగే త్రిష కూడా తన ప్రాభవాన్ని కోల్పోయింది. రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటు, పెద్ద స్టార్స్ ఈమెను కోరుకోలేదు. దాంతో త్రిష కెరీర్ ఖతం అయినట్లే అని అంతా భావించారు. అయితే తన రీఎంట్రీని ‘మోహిని’తో ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.
గత సంవత్సర కాలంగా ‘మోహిని’ చిత్రాన్ని త్రిష చేస్తోంది. ఆర్ మదేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మోహిని’ చిత్రంతో త్రిష మళ్లీ తెలుగు మరియు తమిళంలో బిజీ అవ్వడం ఖాయం అని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. అంతా భావిస్తున్నట్లుగానే త్రిష ‘మోహిని’ చిత్రంలో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్ కార్యక్రమాలు జరుపుతున్నాడు. ట్రైలర్లో త్రిష తన నట విశ్వరూపం చూపించడంతో పాటు, తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని చెప్పకనే చెప్పింది. దాంతో ఈ సినిమా తర్వాత తప్పకుండా త్రిషకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు. తెలుగులో మోహిని టీజర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
జయ అపోలో వీడియో బయటకు వచ్చిందోచ్.
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం ఎన్ని వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె మరణం ఓ విధంగా తమిళనాడు రాజకీయాలనే కాదు మొత్తం రాష్ట్ర గతినే మార్చేసింది. జయ వ్యక్తిగత, రాజకీయ వారసత్వం కోసం ఇంకా యుద్ధం కొనసాగుతూనే వుంది. ఆమె ఆస్తులు, అన్నాడీఎంకే పార్టీలో పదవుల కోసం ఇంకా రచ్చ సాగుతూనే వుంది. ఈ రేసులో మొదట్లో అంతా తానే అయి ముందుకు నడిచిన శశికళ వర్గం ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడింది. పాత కేసులో శశికళ జైలుకు వెళితే, కేంద్రంతో కాలు దువ్వినందుకు ఆమె అనుచరగణం మీద ఐటీ ఇతరత్రా దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఈ పరిస్థితుల్లో జయ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలు వచ్చాయి. అక్కడా శశి వర్గానికి చెందిన దినకరన్ డబ్బులు పంచి, ఈసీ కి లంచం ఎర వేసి అడ్డంగా దొరికిపోయారు. తమిళ ప్రజల్లో ఇంకా శశికళ మీద ఎన్నో అనుమానాలు.

శశికళ వల్లే జయలలిత చనిపోయారని, కేసులు ఎదుర్కొన్నారని భావిస్తున్న వాళ్ళ సంఖ్య తమిళనాడులో చాలా ఎక్కువ. జయ మరణం తర్వాత శశి వ్యతిరేకులు ఇదే అంశాన్ని ఇంకాస్త విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ పరిస్థితుల్లో జనం నమ్మకాన్ని మళ్లీ పొందాలంటే జయ మరణంతో తమకు సంబంధం లేదని, చివరి దాకా ఆమె ఆరోగ్యం కోసం శ్రమించామని చెప్పేందుకు శశికళ వర్గం తాజాగా ఓ పాచిక విసిరినట్టు తెలుస్తోంది. జయ ఆస్పత్రిలో ఉండగా తీసిన ఓ వీడియో ను ఆర్కే నగర్ ఎన్నికలకు ముందు విడుదల చేసింది. ఆ వీడియో లో జయ జ్యూస్ తాగుతూ కనిపించారు.
అజ్ఞాతవాసి టీజర్ అరుపులు…
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ కీర్తి సురేష్ మరియు అను ఇమ్మానుఎల్ హీరో హీరోయిన్లు గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ కి ‘అజ్ఞాతవాసి’ 25 వ చిత్రం అవ్వటంతో పాటు, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వెళుతున్న కారణంగా ఇంకా పవన్ కళ్యాణ్ నటించే లాస్ట్ సినిమా అనుకుంటున్న నేపధ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు…
ఇప్పటికే రిలీజ్ అయిన అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన రెండు పాటలు ఒక్కరోజులోనే 1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్నది అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో అర్ధమవుతోంది. ఈరోజు అజ్ఞాతవాసి మూవీ టీజర్ రిలీజ్ కాబోతున్న సందర్భంలో పవన్ ఫాన్స్ ఇప్పటికే ప్రత్యేకమైన లార్జ్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేసారు. కొంతమంది ఫాన్స్ బైక్ రేస్ లతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇంకొంతమంది ఫాన్స్ పవన్ కళ్యాణ్ ఫొటోస్ కి పాలాభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ మూవీ టీజర్ మీఅందరికోసం.. మీరు కూడా ఒక లుక్ వేయండి
వర్మ కడప రెడ్ల సిరీస్ వచ్చేసింది

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగానే ‘కడప’ వెబ్ సిరీస్ ట్రైలర్ను విడుదల చేశాడు. దాదాపు అయిదు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్రైలర్లోనే తన వెబ్ సిరీస్లో ఏం ఉండబోతుంది, ఎలాంటి సన్నివేశాలను తన వెబ్ సిరీస్లో చూపించబోతున్నాడో వర్మ చెప్పకనే చెప్పాడు. పలు ఫ్యాక్షన్ సీన్స్ను తన గత చిత్రాల నుండి కాపీ కొట్టినట్లుగా అనిపిస్తున్నాయి. యూట్యూబ్లో పెట్టే కంటెంట్కు ఎలాంటి సెన్సార్ అక్కర్లేదు కనుక విచ్చలవిడిగా బూతులను వాడటంతో పాటు, మరీ దారుణంగా రక్తపాతంను చూపించడం జరిగింది. వర్మ కొన్ని సీన్స్లలో మరీ వల్గర్ బూతులను వాడటం జరిగింది. చెప్పడానికి సైతం వీలు లేనివర్మ ‘కడప’ వెబ్సిరీస్ ట్రైలర్ టాక్
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగానే ‘కడప’ వెబ్ సిరీస్ ట్రైలర్ను విడుదల చేశాడు. దాదాపు అయిదు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్రైలర్లోనే తన వెబ్ సిరీస్లో ఏం ఉండబోతుంది, ఎలాంటి సన్నివేశాలను తన వెబ్ సిరీస్లో చూపించబోతున్నాడో వర్మ చెప్పకనే చెప్పాడు. పలు ఫ్యాక్షన్ సీన్స్ను తన గత చిత్రాల నుండి కాపీ కొట్టినట్లుగా అనిపిస్తున్నాయి. యూట్యూబ్లో పెట్టే కంటెంట్కు ఎలాంటి సెన్సార్ అక్కర్లేదు కనుక విచ్చలవిడిగా బూతులను వాడటంతో పాటు, మరీ దారుణంగా రక్తపాతంను చూపించడం జరిగింది. వర్మ కొన్ని సీన్స్లలో మరీ వల్గర్ బూతులను వాడటం జరిగింది. చెప్పడానికి సైతం వీలు లేని ఆ డైలాగ్స్ను వర్మ కావాలని మరీ జొప్పించినట్లుగా అనిపిస్తుంది.
ట్రైర్లోనే ఈస్థాయి రక్తపాతం మరియు బూతులు ఉన్నాయి అటే మొత్తం వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో తాను చూపించాలని భావించి, చూపించలేక పోయిన సీన్స్ను, బూతులను ఈ వెబ్ సిరీస్లో వర్మ చూపించాలని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది. వర్మ వెబ్ సిరీస్ రెడ్డి వర్గంను టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆ వర్గం వారు చాలా ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్యాక్షనిజంకు రాయలసీమ అమ్మ అయితే కడప అయ్య అన్నట్లుగా ఉన్న డైలాగ్లు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. వర్మ ఆ వెబ్ సిరీస్ను విడుదల చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పుడే కొందరు బెదిరిస్తున్నారు. కాని వర్మ అలాంటి వాటికి బెదిరిపోయే రకం కాదు అని అందరికి తెల్సిందే. వర్మ కడప వెబ్ సిరిస్ మరెంత దుమారంను రేపుతుందో చూడాలి. ఆ డైలాగ్స్ను వర్మ కావాలని మరీ జొప్పించినట్లుగా అనిపిస్తుంది.
ట్రైర్లోనే ఈస్థాయి రక్తపాతం మరియు బూతులు ఉన్నాయి అటే మొత్తం వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో తాను చూపించాలని భావించి, చూపించలేక పోయిన సీన్స్ను, బూతులను ఈ వెబ్ సిరీస్లో వర్మ చూపించాలని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది. వర్మ వెబ్ సిరీస్ రెడ్డి వర్గంను టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆ వర్గం వారు చాలా ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్యాక్షనిజంకు రాయలసీమ అమ్మ అయితే కడప అయ్య అన్నట్లుగా ఉన్న డైలాగ్లు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. వర్మ ఆ వెబ్ సిరీస్ను విడుదల చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పుడే కొందరు బెదిరిస్తున్నారు. కాని వర్మ అలాంటి వాటికి బెదిరిపోయే రకం కాదు అని అందరికి తెల్సిందే. వర్మ కడప వెబ్ సిరిస్ మరెంత దుమారంను రేపుతుందో చూడాలి.
‘మిడిల్క్లాస్ అబ్బాయి’ ట్రైలర్ రివ్యూ
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న నాని, దిల్రాజుల కాంబినేషన్లో మూవీ అనగానే ఖచ్చితంగా సూపర్ హిట్ అంటూ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాని, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటాడు చూపించేందుకు ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. నాని సినిమా అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారు, ఎలా ఉండాలని కోరుకుంటారో అచ్చు అలాగే ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది.

ముందు నుండి చెబుతున్నట్లుగా ఈ చిత్రంలో వదిన మరిదిల మద్య జరిగే సన్నివేశాలు సినిమాకు చాలా హైలైట్గా ఉంటాయని ట్రైలర్ను చూస్తుంటే అనిపిస్తుంది. సినిమాపై ఆసక్తితో పాటు పలు ప్రశ్నలను కూడా ట్రైర్ లేవనెత్తి, సినిమా చూసేలా ఆసక్తిని పెంచుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను ఈనెల 21న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్నాయి.

నాని వరుస సక్సెస్లను ఈ చిత్రం కొనసాగిస్తుందని, ఈ సంవత్సరంలో దిల్రాజు బ్యానర్కు డబుల్ హ్యాట్రిక్ను ఈ చిత్రం దక్కిస్తుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ‘హలో’కు పోటీగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ఆ సినిమా స్థాయిలోనే ఉంటుందని ట్రైలర్తో తేలిపోయింది. సాయి పల్లవి, నానిల మద్య రొమాన్స్, నాని భూమికల మద్య వదిన మరిది సంబంధం చాలా సహజంగా ఉంటుందని తేలిపోయింది. తప్పకుండా మిడిల్ క్లాస్ కుర్రాడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.





