భార్యతో సంబంధం పెట్టుకున్నాడని.. నరికి చంపేసిన భర్త…ఆపై..

Illegal relationship with Pinney .... Babai's murder

తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. తన భార్యతో అక్రం సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అతి కిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా చేతిని నరికి తన భార్యకు ఇచ్చాడు. ఈ ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర కలకలం రేపింది. మరెవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే తనకు అదే శాస్తి జరుగుతుందని తీవ్రంగా హెచ్చరించాడు కూడా. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని పుదుప్పేట్టై కృష్ణన్‌ ఆలయ వీధికి చెందిన బాలసుబ్రహ్మణి అలియాస్‌ రాజీబాయ్‌ ఓ ప్రైవేటు సంస్థలో పని చేసేవాడు. ఈ నెల 3న తిరువణ్ణామలై రోడ్డు వద్ద ఉన్న శ్మశానంలో అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించిన పోలీసులు మరో ప్రాంతంలో అతడి చేయిని స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తోంది.

కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానంతో రాణిపేటకు చెందిన లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే ఆ నేరం చేసినట్లుగా ఒప్పేసుకున్నాడు. అయితే కృష్ణగిరికి చెందిన ఆ వ్యక్తి లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కొన్నాళ్ల క్రితం భారతీనగర్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ కేసులో అతడు అరెస్టై జైలుకు వెళ్లడంతో భార్య ఒంటరిగా గడపసాగింది. ఈ సమయంలో బాలసుబ్రహ్మణి అనే యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్తా పెరిగి అక్రమ బంధానికి దారితీసింది. అలా వారిద్దరూ శారీరకంగా కలుస్తుండటంతో ఆమె గర్భం దాల్చింది. జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను తీవ్రంగా మందలించాడు. గర్భం తొలగించుకోవాలని.. బాలసుబ్రహ్మణితో అక్రమ సంబంధం వదులుకోవాలని చెప్పినా ఆమె ఏమాత్రం వినిపించుకోకుండా పెడచెవిన పెట్టింది.

అంతేకాకుండా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న బాలసుబ్రహ్మణిపై అతడు రోజురోజుకీ కక్ష పెంచుకున్నాడు. సమయం కోసం వేచి చూచాడు. ఈ నెల 3వ తేదీన అతడిని మద్యం తాగుదామని పిలిచి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత అతడి చేయిని నరికి ఇంటికి తీసుకెళ్లి భార్యకు ఇచ్చాడు. ఇకపై ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే ఆ వాడిని కూడా ఇలాగే జరుగుతుందని హెచ్చరించాడు. కాగా సోమవారం అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఆ తర్వాత అతడిని సేలం సెంట్రల్ జైలుకి తరలించారు. తిరిగి మళ్లీ ఈ నేరంతో తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.