కార్ డ్రైవర్ మోజులో పడి…భర్త దారుణ హత్య !

Wife killed Husband With Her Lover

ప్రియుడి మోజులో పడి భర్తను భార్యే చంపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సెప్టెంబరు 18 న కొడైకెనాల్ సమీపంలో లభ్యమైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం కర్ణాటకకు చెందిన మహ్మద్ సమీర్‌దిగా పోలీసులు గుర్తించారు. అయితే అతడి చావుకు వివాహేతర సంబంధమే కారణమని విచారణలో వెలుగుచూసింది.

Lovers

ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సమీర్ భార్య తన ప్రియుడి సాయంతో హత్యచేసి అక్కడ పడేసినట్టు వారి దర్యాప్తులో వెల్లడయ్యింది. పోలీసులు వివరాల ప్రకారం మృతుడు సమీర్‌ రెండేళ్ల క్రితం ఫిర్‌దౌస్‌ అనే యువతిని వివాహం చేసుకోగా వారికి ఆరునెలల కుమార్తె ఉంది. అరబ్‌ దేశంలో ఇంజినీరుగా పనిచేసే అతడు ప్రతినెలా ఖర్చులకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతూ ఆరు నెలలకు ఒకసారి భార్య వద్దకు వచ్చి వెళ్లేవాడు. భర్త విదేశాల్లో ఉన్నపుడు ఫిర్‌దౌస్‌కు మంగళూరుకు చెందిన కారు డ్రైవర్‌ మహ్మమద్‌ యాసిన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

marriage

అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఫిర్‌దౌస్‌, భర్త అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఆగస్టులో గల్ఫ్‌ నుంచి వచ్చిన సమీర్‌ను పథకం ప్రకారం విహారయాత్రకు కొడైకెనాల్‌ తీసుకెళ్లి హతమార్చింది. ప్రియుడు మహ్మద్‌ యాసిన్ సాయంతో గొంతు కోసి చంపేసింది. తర్వాత పాపతో కలిసి ఇంటికి వెళ్లిన ఆమెను, కుటుంబ సభ్యులు భర్త గురించి అడగ్గా సేలంలో తన స్నేహితురాలితో వెళ్లిపోయాడని ఫిరదోష్‌ బదులిచ్చింది. అయితే, ఇంట్లోని 60 సవర్ల బంగారం తీసుకుని పారిపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మహ్మద్‌ సమీర్‌ హత్యకు గురైనట్లు గుర్తించారు. ప్రియుడితో కలిసి ఆమె హత్యకు పథకం వేసిందని, ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.